గ్రామ రెవిన్యూ అధికారి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
{{వర్గీకరణ}}
పూర్వం [[కరణం]] [[మునసబు]] [[పటేల్]] [[పట్వారీ]] లు వారి సొంత గ్రామాల్లోనే ఉండి పాలన నడిపేవారు. 1985 లో వీరిని తీసేసి గ్రామ పాలనాధికారుల్ని ([[వి.ఏ.వో]] ) ప్రవేశపెట్టారు. [[పంచాయితీ]]ల నుంచి రెవెన్యూ వ్యవస్థను వేరు చేసిన నేపథ్యంలో 2007 ఫిబ్రవరి నుంచి వీఆర్వోల విధానం అమలులోకి వచ్చింది. జనాభా ప్రాతిపదికన వారిని నియమించారు. 5000 జనాభా ఉంటే ఒకరు, 5 వేల నుంచి 10,000 మంది వరకు ఉంటే ఇద్దరు, పది వేల నుంచి పదిహేను వేల మంది ఉంటే ముగ్గురు చొప్పున గ్రామ రెవిన్యూ అధికారి [[వీ.ఆర్.వో]] లు ఉండడానికి అనుమతి ఇచ్చారు. కానీ పంచాయతీ కార్యదర్శులను వీ ఆర్వోలుగా తీసుకున్న సమయంలో 'ఎక్కడి వారు అక్కడే' అన్న పద్ధతిలో వారిని ఉంచేశారు. ఫలితంగా కొన్ని చోట్ల ఉండవలిసిన వారికంటే ఎక్కువ మంది ఉంటే.. ఇంకొన్ని చోట్ల అసలే లేకుండాపోయారు. ఈ అసమానత కారణంగా ప్రజలకే గాక పాలనపరంగా కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎవరినీ సొంత గ్రామానికి బదిలీ చేసేది లేదు. ఆయా జిల్లాల్లో ఖాళీగా ఉన్న వీఆర్వో ఉద్యోగాల భర్తీ సంబంధిత జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్‌సీ) చేస్తుంది.. కొన్ని గ్రామాలను కలిపి ఒక సమూహం (క్లస్టర్) గా ఏర్పాటుచేశారు. రాష్ట్రంలో 12,397 క్లస్టర్లు ఉండగా 17,008 వీఆర్వోలు అవసరం. ప్రస్తుతం సుమారు 14,800 మంది వీఆర్వోలే ఉన్నారు. రాష్ట్రంలోని 21,809 గ్రామ పంచాయతీలను పరిపాలనా సౌలభ్యం కోసం 12,397 క్లస్టర్లుగా ఏర్పాటు చేసింది. 5 వేల జనాభా ఉన్న ఒకటి లేదా రెండు మూడు పంచాయతీలను కలిపి ఒక క్లస్టరుగా గుర్తించారు. ప్రతి క్లస్టర్‌కు ఒక కార్యదర్శి ఉండాలి. ప్రతి పంచాయతీ క్లస్టర్ 5 కిలోమీటర్ల పరిధిలో ఉండాలి.
ఒక కార్యదర్శికి ఒక పెద్ద పంచాయతీ లేదా ఏడు చిన్నపంచాయతీల బాధ్యతలను అప్పగించారు. ఏజెన్సీ ప్రాంతంలో [[గ్రామ కార్యదర్శి]] ని కలవాలంటే 40-50 కిలోమీటర్లు ప్రజలు పయనించాలి. అడవుల మధ్యలో ఉన్న చిన్నపంచాయతీలకు వెళ్లాలంటే సరైన రవాణా సౌకర్యం లేదు. కనీసం గ్రామానికి ఒకరుండాలంటే పూర్వం లాగానే పంచాయతీ రెవిన్యూ శాఖలను ఏకంచెయ్యాలి. 2001 జనాభా లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో మొత్తం 28,123 [[గ్రామాలు]] న్నాయి. అందులో 26,613 నివాసిత గ్రామాలు 1,510 నివాసాలు లేని గ్రామాలు.
 
 
[[వర్గం:పాలనా విభాగములు]]