ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ [[భారత్|భారత దేశపు]] తొట్టతొలి పూర్తి స్వదేశీ నిర్మిత అణు-జలాంతర్గామి. దీనిని [[ఆంధ్ర ప్రదేశ్]]లోని, [[విశాఖపట్నం]] డాక్‌యార్డ్‌నందు నిర్మితమయింది. ఇది 2012 నాటికి పూర్తిస్థాయిగా నావికాదళంలో చేరుతుంది. దీనితో ఇటువంటి పరిజ్ఞానం కలిగిన [[అయిదు పెద్ద దేశాలు|అయిదు పెద్ద దేశాల]] సరసన భారత్ ఆరవ దేశంగా నిలిచింది. దీనిలో అణు వార్‌హెడ్లను మోసుకుపొగలమోసుకుపోగల [[కె-15]] ([[సాగరిక]]) క్షిపణులు ఉంటాయి. దీనితో నేల, నింగి, నీరు మూడు విధాలుగాను అణు క్షిపణులను ప్రయోగించగల పెద్ద దేశాల సరసన భారత్ చేరింది. ఇది స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మితమవుతున్న [[అరిహంత్ తరగతి జలాంతర్గామి|అరిహంత్ తరగతి జలాంతర్గాముల్లో]] మొదటిది. ఇంకో నాలుగు వేర్వేరు నిర్మాణ దశల్లో ఉన్నాయి. [[అడ్వాన్డ్స్‌ టెక్నాలజీ వెసల్(ఏటీవీ)]] పేరుతో కొన్ని దశాబ్దాలు పాటు అత్యంత రహస్యంగా సాగింది దీని నిర్మాణం. దీని పొడవు 117 మీటర్లు. బరువు 6000 టన్నులు. దీనిలో [[కల్పక్కం అణుపరిశోధనా సంస్థ]] రూపొందించిన 80 మెగావాట్ల సామర్థ్యం కల్గిన [[అణు రియాక్టరు]] ఉంది. దీని మొదటి జలప్రవేశం జులై 26, 2009 తేదీన, అప్పటి ప్రధాని [[మన్మోహన్ సింగ్]] సతీమణి [[గురుశరణ్ కౌర్]] చేతుల మీదుగా సాగింది. ఇలా మహిళల చేతుల మీదుగా జలప్రవేశం చేయించడం నావికాదళ సాంప్రదాయం. ఆ రోజు [[కార్గిల్ విజయ్ దినం|కార్గిల్ విజయ్ దినానికి]] పదవ ఏడాది కావడం విశేషం.
"https://te.wikipedia.org/wiki/ఐఎన్‌ఎస్‌_అరిహంత్‌" నుండి వెలికితీశారు