'''లోగుట్టు పెరుమాళ్ళకెరుక''' 1966లో విడుదలైన తెలుగు సినిమా. దర్శక నిర్మాత [[వై.వి.రావు]] బావ ఎస్.భావనారాయణ నిర్మించిన ఈ సినిమాతో ప్ర,ముఖప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు [[కె.ఎస్.ఆర్.దాస్]] దర్శకునిగా పరిచయ్యాడు.<ref>http://www.telugucinema.com/c/publish/stars/interview_ksrdas.php</ref> ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద విజయవంతం కాలేదు. [[శోభన్ బాబు]] చిత్రరంగంలో నిలదొక్కుకుంటన్న దశలో తను సోలో హీరోగా నటించిన తొలిచిత్రాల్లో ఒకటైన ఈ చిత్రం, విజయవంతమై ఉంటే తనకు క్రైంహీరో ఇమేజ్ స్థిరపడి ఉండేదని శోభన్ బాబు ఆ తరువాత దశలో ఒక ముఖాముఖిలో చెప్పుకున్నాడు.<ref>http://www.telugucinema.com/c/publish/stars/interview_shobanbabu_printer.php</ref>
==చిత్రకథ==
నగరంలో కిడ్నాపులు ఎక్కువగా జరుగుతుంటాయి. గుమ్మడి పురప్రముఖుడు. కిడ్నాపులు అరికట్టటానికి ప్రయత్నిస్తూ, కిడ్నాపర్లను పట్టుకున్నవారికి పదివేలు బహుమతి ప్రకటిస్తాడు. పోలీసు ఆఫీసరు [[ఉప్పు శోభనా చలపతి రావు|శోభన్ బాబు]] ఒక పెయింటరు గాపెయింటరుగా నగరంలో ప్రవేశిస్తాడు. గుమ్మడి కూతురు అతన్ని ప్రేమిస్తుంది. ఆమె కోరికమీద గుమ్మడి శోభన్ని తన గెస్ట్ హౌస్ లోహౌస్లో ఉండమంటాడు. ప్రభాకర రెడ్డి కూతుర్ని కిడ్నాప్ చేస్తామని లేదా డబ్బు ఇమ్మని బెదిరింపు వస్తుంది. ప్రభాకర్ రెడ్డి పోలీసులను, ప్రవేటు డిటెక్టివ్లనుడిటెక్టివులను నమ్మి డబ్బు ఇవ్వడు. అమ్మాయై కిడ్నాప్ ఔతుంది. రాజశ్రీ తండ్రి కిడ్నాపర్ల వల్ల ప్రాణాలు కోల్పోతాడు. ఆమె కిడ్నాపర్లను పట్టుకొనే ప్రయత్నం లో ఉంటుంది. ఒక సారి శోభన్ బాబు సహాయం పొంది ,ఇద్దరి ఆశయం ఒకటే అని తెలుసు కుంటారు. వీళ్ళను శోభన్ ప్రేయసి అపార్ధం చేసుకుంటుంది. చిత్రం చివరలో గుమ్మడే కిడ్నాపర్ ముఠా లీడరు అని తెలుస్తుంది