జనమంచి శేషాద్రి శర్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
 
==జీవిత సంగ్రహం==
వీరు [[1882]] సంవత్సరంలో [[జూలై 4]]వ తేదీన [[నెల్లూరు జిల్లా]] [[కలువాయి]] గ్రామంలో వైదిక బ్రాహ్మణ కుటుంబంలో సుబ్రహ్మణ్యావధాని మరియు కామాక్షమ్మ దంపతులకు జన్మించారు. వీరి ప్రపితామహులు సూర్యనారాయణ సోమయాజి మరియు పితామహులు వేంకటావధాని. వీరి పెద్దల నివాసస్థానం కడప జిల్లా [[బద్వేలు]] తాలూకా [[వెంకటరాయపురం]] అగ్రహారం. కడపలో కొంతకాలం ఉద్యోగం చేసి తరువాత కాలంలో కాశీ, విజయనగరం,కాలినడకన వెళ్ళి అక్కడ నాలుగు సంవత్సరాలు విద్యా వ్యాసంగం చేశారు. తరువాత విజయనగరంలోను మరియు కసింకోట మొదలైన ప్రాంతాలలో సంచరించారువిద్యా తపస్విగా నివసించారు. వీరు చాలా శాస్త్రాలను పఠించారు. చాలావీరు మొదట సి.ఎస్.బి. పాఠశాలలోహైస్కూలులో తెలుగు పండితునిగా పనిచేసి, అక్కడ నుండి కర్నూలు కోల్స్ మెమోరియల్ హైస్కూలులో పనిచేసి, చివరిగా మునిసిపల్ ఉన్నత పాఠశాల, కడప లో 1901 నుండి దీర్ఘకాలం ప్రధానాంధ్ర పండితునిగా పనిచేసి 1937లో గజోత్సవంతో పదవీ విరమణ చేశారు.
 
వీరి పదిహేనవ ఏటనే కవిత్వాన్ని ప్రేమించి [[అవధానాలు]] చేయడం ప్రారంభించారు. శతావధానాలు కూడా చేశారు. [[కందుకూరి వీరేశలింగం పంతులు]] వంటి వ్యక్తుల ఉపదేశాల వలన కావ్య రచనా కార్యక్రమానికి దీక్ష వహించి జీవితాంతం విద్యార్ధిగా కృషిచేశారు. గురుకులావాసంతో, స్వయంకృషితో వీరు నాటకాంత సాహిత్యం, అలంకార శాస్త్రం, వ్యాకరణం, స్కంధత్రయ జ్యోతిషం, యోగ, మంత్ర శాస్త్రం, ధర్మ శాస్త్రం మొదలైన వాటిలో పరిశ్రమ చేసి మంచి ప్రావీణ్యం సంపాదించారు. ఆయుర్వేదంలో చక్కని నాడీజ్ఞానం పొందారు. వీరికి సాహిత్య గురువు రఘుపతి శాస్త్రి, వ్యాకరణ గురువు దాసాచార్యులు, జోతిశ్శాస్త్ర గురువు తోపల్లి చయనులు. వీరు విద్యా తపోనిధిగా ఎంతో మంది శిష్యులకు అక్షరదానం చేసిన విద్యాదాత వీరు.
 
వీరికి 'బాలసరస్వతి', 'అభనవ ఆంధ్ర వాల్మీకి', 'ఆంధ్ర వ్యాస', 'కావ్యతీర్థ', 'కళాప్రపూర్ణ' మొదలైన బిరుదులు కలవు. వీరు చాలా సన్మానాలు పొందారు.<ref>[http://books.google.co.in/books?id=KnPoYxrRfc0C Encyclpopaedia of Indian Literature. ISBN:8126012218]</ref>