చదలవాడ ఉమేశ్ చంద్ర: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 2:
==బాల్యము, విద్య==
ఉమేశ్ చంద్ర మార్చ్ 19, 1966న [[గుంటూరు]] జిల్లా [[పెదపూడి]] గ్రామములో వేణుగోపాల రావు, నయనతార దంపతులకు జన్మించాడు. తండ్రి [[హైదరాబాదు]] [[ఆల్విన్]] సంస్థలో ఉద్యోగి. హైదరాబాద్ పబ్లిక్ పాఠశాలలో చదివిన పిదప [[నిజాం కళాశాల]] నుండి బి.ఎ (1987)
==ఉద్యోగ పర్వము==
1991లో 'భారత పోలీస్ సేవ' లో ఎన్నికై 'జాతీయ పోలీస్ అకాడెమీ' లో శిక్షణ పొందాడు. 1992 నుండి 1994 వరకు వరంగల్లులో ఉప పోలీస్ సూపరింటెండెంట్ గా పని చేశాడు. "జన జాగృతి" కార్యక్రమము ప్రారంభించి ప్రజలకు దగ్గరయ్యాడు. 1994 అక్టోబర్ లో పులివెందులకు బదిలీ కాబడి అచట సంఘ వ్యతిరేక శక్తులను అణచివేసి సామాన్య ప్రజల అభిమానము చూరగొన్నాడు. ఫిబ్రవరి 1995లో వరంగల్లు తిరిగివచ్చి 'ప్రత్యేక విధుల అధికారి' గా నేరస్థులను అరికట్టాడు. ప్రజలతో మమేకమై పోలీసులపై సంఘములోగల దురభిప్రాయములు తొలగించాడు. ఎంతో మంది నక్సలైట్లను పట్టుకొనుటలో సఫలమయ్యాడు. 1995 జూన్ లో పోలీస్ సూపరింటెండెంట్ గా పదోన్నతి పొంది కడప జిల్లాకు తిరిగి వచ్చాడు. జూన్ 1997 నుండి ఎప్రిల్ 1998 వరకు కరీమ్ నగర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గా విధులు నిర్వర్తించాడు.
నవంబర్ 1998లో ఉప ఇనస్పెక్టర్ జనరల్ (సంక్షేమము, ఆటలు)గా పదోన్నతి పొందాడు.
==విషాదము==
ఉమేశ్ చంద్ర సెప్టెంబర్ 4, 1999 న హైదరాబాదులో కారులో వెళ్తూ ట్రాఫిక్ దీపము వద్ద ఆగగా నలుగురు నక్సలైట్లు కాల్పులు జరిపారు. అంగరక్షకుడు, డ్రైవర్ వెంటనే మరణించారు. ఉమేశ్ చంద్ర కారు దిగి నక్సలైట్లను తరిమి వెంటాడాడు. ఆతని వద్ద పిస్తోలు లేదని గ్రహించిన నక్సలైట్లు ఆగి రెండు సార్లు కాల్పులు జరిపారు. గుండు దెబ్బలు తిని పడిపోయిన ఉమేశ్ చంద్ర వద్దకు వచ్చి సమీపము నుండి కాల్చి పారిపోయారు.
సెప్టెంబర్ 4, 2000 న ఉమేశ్ చంద్ర విగ్రహము సంజీవరెడ్డి నగర్ కూడలి వద్ద నెలకొల్పబడింది.
==మూలాలు==
{{reflist}}
|