పువ్వుల సూరిబాబు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
వీరు చాలా విభిన్నమైన పాత్రలను పోషించారు. వాటిలో నారదుడు, కంసుడు, ధర్మరాజు, విప్రనారాయణ, బిల్వమంగళుడు, భవానీశంకరుడు, రాజరాజు, సుబుద్ధి, రామదాసు, చినరంగారావు, ధర్మారాయుడు మొదలైనవి ముఖ్యమైనవి. ఎన్ని నాటకాలాడినా, ఆయన గాత్రం కంచు గంటలా మారుమ్రోగేది. మైక్ లేకపోయినా ఒక ఫర్లాంగు దూరం వరకు పద్య పఠనము, వాచిన విధానము క్లియర్ గా వినపడేవి. పద్యాన్ని భావయుక్తంగా విరిచి పాడడంతో ప్రేక్షకులను అవలీలగా ఆకట్టుకొనేవారు.
 
1946లో [[మైసూరు]] మహారాజావారి దర్బారులో వీరి నాటకాలను ప్రదర్శించి సన్మానం పొందారు. 1957లో [[తెనాలి]]లో సూరిబాబుకి గజారోహణం, గండపెండేరం మొదలైన సన్మానాలు జరిపి ''కళావిశారద'', ''గాన గంధర్వ'' మొదలైన బిరుదులు అందుకున్నారు.
 
భారతదేశమంతా అపార ఆదరాభిమానాలను సంపాదించిన సూరిబాబు [[ఫిబ్రవరి 12]], [[1968]] న స్వర్గస్తులైనారు.
"https://te.wikipedia.org/wiki/పువ్వుల_సూరిబాబు" నుండి వెలికితీశారు