బిపిన్ చంద్ర పాల్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Gurubrahma (చర్చ | రచనలు) వ్యాసం మొదలెట్టా |
(తేడా లేదు)
|
08:10, 21 సెప్టెంబరు 2009 నాటి కూర్పు
బిపిన్ చంద్ర పాల్ (నవంబర్ 7, 1858–మే 20 1932) సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు లాల్ బాల్ పాల్ త్రయంలో మూడవ వాడు. 1905లో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా పోరాడాడు. జాతీయోద్యమ పత్రిక బందే మాతరంను మొదలెట్టాడు. ఆ పత్రికలో అరబిందో వ్రాసిన వ్యాసానికి సంబంధించిన కేసులో వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వనందున ఆరు మాసాలు జైలు శిక్ష అనుభవించాడు. తెలుగువారితో సహా ఎందరో భారతీయులను స్వాతంత్ర్య సమరమందు ఉత్తేజితులను చేసాడు. ఆ పై గాంధీ సారథ్యాన్ని, ఆయన సిద్ధాంతాలను, ముఖ్యంగా ఖిలాఫత్ వంటి పోరాటాలలో ఆధ్యాత్మికత, మతము, స్వాతంత్ర్య పోరాటములకు లంకె పెట్టడాన్ని వ్యతిరేకించాడు. బ్రహ్మ సమాజంలో సభ్యుడైన పాల్ ఒక వితంతువును వివాహమాడాడు.
బిపిన్ చంద్ర పాల్ | |
---|---|
నవంబర్ 7, 1858–మే 20 1932 | |
జన్మస్థలం: | హబీజ్గంజ్ జిల్లా, (నేటి బంగ్లాదేశ్ లో భాగం) |
ఉద్యమం: | భారత స్వాతంత్ర్యోద్యమము |
ప్రధాన సంస్థలు: | భారత జాతీయ కాంగ్రేసు, బ్రహ్మ సమాజం |
బయటి లంకెలు
- ఒక జీవితచరిత్ర, బంగ్లాపీడియా