వరాహగిరి వెంకట జోగయ్య: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''వరాహగిరి వెంకట జోగయ్య''' ([[1870]] - [[1939]]) ప్రముఖ న్యాయవాది.
వీరు గోదావరి జిల్లా [[చింతలపల్లి]] గ్రామంలో జన్మించారు. వీరి పెంపుడు తండ్రి నరసయ్య పంతులు మందసా సంస్థానంలో కొంతకాలం దివానుగా పనిచేశారు. వీరు 1888 సంవత్సరంలో బరంపురం నేటివ్ కాలేజీలో ఎఫ్.ఏ. పరీక్ష పాసై, 1894లో ఫస్టు గ్రేడు ప్లీడరు పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. 1896లో బి.ఏ. పట్టా పుచ్చుకున్నారు. చిరకాలంలోనే వకీలు వృత్తిలో మంచి అభివృద్ధి సాధించారు. బరంపురం న్యాయస్థానంలో ప్రముఖ న్యాయవాదిగా పేరుపొంది, బార్ అసోషియేషన్ ప్రెసిడెంటుగాను, పబ్లిక్ ప్రాసిక్యూటరుగాను కొంతకాలం ఉన్నారు. ప్రజాసేవ కార్యాలలో పాల్గొనడానికి వీరు పదవి అడ్డురావడంతో దానిని త్యజించారు.
వీరు చాలాకాలం మునిసిపాలిటీ, తాలూకా బోర్డులలోను సభ్యునిగా ఉన్నారు. 1907 నుండి 1917 వరకు అఖిల భారత కాంగ్రెసు కమిటీలలో సభ్యులుగా ఉన్నారు.
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
|