నాగార్జునకొండ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:NK museum.jpg|thumb|right|250px|మ్యూజియం ప్రధాన స్థావరం.]]
సుప్రసిద్ధ బౌద్ధ దార్శనికుడు ఆచార్య [[నాగార్జునుడు]] పేర వెలసినది [[నాగార్జున కొండ]]. శాతవాహన చక్రవర్తి [[యజ్ఞశ్రీ శాతకర్ణి]] నాగార్జునుని కొరకు శ్రీపర్వతంపై మహాచైత్య విహారాలను నిర్మించాడని ఇతిహాసం తెలియజేస్తుంది. [[నాగార్జున సాగర్]] నిర్మాణ సమయంలో బయల్పడిన క్రీ.పూ.2వ శతాబ్ధపు బౌద్ధావశేషాలను [[జలాశయం]] మధ్య కొండపై నిర్మింపబడిన [[నాగార్జునకొండ మ్యూజియం]] లో భధ్రపరిచారు. ఈ ద్వీపపు [[మ్యూజియం]] ప్రపంచంలోనే అరుదైనదిపురావస్తు ప్రదర్శనశాలలన్నిటిలోనూ అతిపెద్ద ద్వీప ప్రదర్శనశాల (Island Museum). [[బుద్ధుడు|బుద్ధునివిగా]] చెప్పబడుతున్న దంతావశేషం, కర్ణాభరణం ఇందులో చూడదగ్గవి.
 
==భౌగోళికం==
నాగార్జునకొండ [[కృష్ణా నది]]కి దక్షిణ తీరాన 16.31 ఉత్తర అక్షాంశము, 79.14 తూర్పు రేఖాంశములపై ఉన్నది. ఇది [[గుంటూరు]] నుండి సుమారు 147 కి.మీ. దూరంలోను, [[హైదరాబాదు]] నుండి సుమారు 166 కి.మీ. దూరంలోను ఉన్నది. దగ్గరలోని రైల్వేస్టేషను [[మాచర్ల]] సుమారు 22 కి.మీ.దూరంలో ఉన్నది.
"https://te.wikipedia.org/wiki/నాగార్జునకొండ" నుండి వెలికితీశారు