నాణెం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం తొలిగింపు
పంక్తి 5:
===భారతదేశంలో===
క్రీ.పూ 1000 సంవత్సరం నుంచి భారతదేశంలో నాణేలు చెలామణిలో ఉన్నాయని కన్నింగ్‌హామ్ అభిప్రాయం. జె.క్రిబ్ అనే మరో పురావస్తు శాస్త్రవేత్త అభిప్రాయం ప్రకారం ఇక్కడ క్రీ.పూ 350 సంవత్సరం కంటే ముందే నాణేలను వినియోగించారు. మనదేశంలో క్రీస్తుపూర్వం 6-7 శతాబ్దాలలో, లేదా అంతకంటే కొంచెం ముందు నాణేలు తయారై ఉండవచ్చునని ''పి ఎల్ గుప్తా''తో పాటు, అధిక సంఖ్యలో చరిత్రకారులు ప్రతిపాదిస్తున్నారు. ఇంత వివాదానికి కారణం తొలినాటి నాణేల మీద పాలకుల వివరాలు లేవు. నాణేలు తమ సంగతి తాము చెప్పలేనపుడు వాటి ఆచూకీ తెలుసుకోవడానికి ఉపయోగపడేవి సాహిత్య, పురావస్తు ఆధారాలే. క్రీ.శ ఒకటవ శతాబ్దానికి చెందినట్టు భావించే [[పాణిని]] తన [[అష్టాధ్యాయి]] గ్రంధంలో నాణేల ప్రస్తావన తెచ్చాడు. క్రీస్తుశకం నాల్గవ శతాబ్దం వాడైన [[కౌటిల్యుడు]] [[అర్థశాస్త్రం]]లో దొంగనాణేలను గురించి, సీసం గనుల గురించి ప్రస్తావించాడు. కాబట్టి దేశంలో పంచ్‌మార్క్‌డ్ నాణేలు నాల్గవ శతాబ్దానికే చెలామణీలో ఉన్నట్టే. లేదంటే కొంచెం ముందు నుంచి ఉండవచ్చు. ఇది అందరూ అంగీకరిస్తున్న చారిత్రక సత్యం.అయితే ఎవరు విడుదల చేశారో చెప్పడానికి ఆధారాలు లేవు. మన కృష్ణాజిల్లా సింగవరంలో లభ్యమైన వెండి నాణేల పరిస్థితి కూడా ఇదే.<ref>http://www.telugudanam.co.in/vijnaanam/meeku_telusaa/naaNela_charitra.htm</ref>
నాణేలు చరిత్రకు అద్దంపట్టే సాక్ష్యాలు. పల్లవుల పరిపాలనా దక్షత, చోళుల వైభవం, నవాబుల విలాసం, కృష్ణదేవరాయల కీర్తి, ఆంగ్లేయుల రాజభక్తిని చాటేవి నాణేలే. స్వాతంత్య్రానంతరం కూడా వీటి ప్రాధాన్యం తగ్గలేదు. భారతదేశ చరిత్రను మలుపు తిప్పిన నేతలు, ఘటనలు, విప్లవాలను నాణేలుగా తీసుకువచ్చింది. స్మృతికీ, పంపిణీకి వేర్వేరుగా ముద్రించడం ప్రారంభించింది.
===నాణేల్లో నిలిచిన మహనీయులు ===
*[[మహాత్మాగాంధీ]] 1969లో జాతిపిత మహాత్మాగాంధీ శతజయంత్యుత్సవాల సందర్భంగా 20 పైసలు, 50 పైసలు, రూ.1, రూ.10 నాణేలు వెలువరించారు. రూ.10 నాణెం విడుదలజేయడం అదే ప్రథమం. అత్యధిక విలువున్న రూ.5, రూ.10 రూపాయలకూ నాణెం ముద్రించేందుకు వీలుగా సంబంధిత చట్టానికి (కాయిన్స్ యాక్ట్) ప్రత్యేక సవరణ కూడా తీసుకువచ్చారు.
*[[జవహర్‌లాల్ నెహ్రూ]] స్వాతంత్య్రానంతరం తొలిసారి 1964లో కేంద్ర ఆర్థిక శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేక నాణెం ముద్రించింది. జవహర్‌లాల్ నెహ్రూ మరణం తర్వాత ఆయన స్మృత్యర్థం దీన్ని ముద్రించారు. 50 పైసలు, రూ.1 నాణెంపై ఆయన ముఖచిత్రం వేశారు.
*[[తిరువళ్లువర్]]
తమిళవేదం 'తిరుక్కురళ్' ప్రదాత తిరువళ్ళువర్. సుమారు రెండువేల సంవత్సరాలుగా తమిళుల జీవితంలో కలగలిసిపోయింది కురళ్. ద్రవిడ పార్టీల నేతలు తిరువళ్ళువర్‌కు పెద్దపీటవేశారు. కరుణానిధి ముఖ్యమంత్రికాగానే బస్సుల్లో కురళ్ సూక్తులు రాయించారు. 1969లో రాష్ట్ర ప్రభుత్వం 'తిరువళ్ళువర్ డే' అనే సెలవుదినం ప్రకటించింది. 1995లో జరిగిన తంజావూరు ప్రపంచ తమిళ సభల్లో తిరువళ్ళువర్ ముద్రతో రూ.5 నాణేన్ని కేంద్ర ప్రభుత్వం వెలువరించింది.
*[[కామరాజర్]]
దక్షిణాది గాంధీగా పేరుపొందిన కామరాజర్ పాలన నిరుపేదలకు ఓ స్వర్ణయుగంగా నేటికీ నిలిచిపోయింది. తమిళనాట పారిశ్రామికాభివృద్ధికి బీజం వేసింది, మధ్యాహ్న భోజన పథకం తొలిసారి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలనుకున్న ఘనత ఆయనదే. ఐఐటీ వంటి సంస్థలు మద్రాసులో అడుగుపెట్టడం వెనుక ఆయన చేసిన కృషి ఎంతో ఉంది. 1976లో ఆయనకు అత్యున్నత పౌరపురస్కారం 'భారతరత్న' లభించింది. 2004 అక్టోబర్ 27న ప్రధాని మన్మోహన్ సింగ్ కామరాజు ముఖంతో రూ.5 సేకరణ నాణెం, రూ.100 కరెన్సీ విడుదలజేశారు.
*[[అన్నాదురై]].
అన్నార్తుల బాధలను తన తమిళ గళంతో వినిపించారు అన్నాదురై. తన కలంలో ఒలికించారు. పేదల బాధలు కడతేరాలంటే ఉద్యమ స్ఫూర్తి ఎన్నికల్లోకి ప్రవేశించాలని భావించి [[డీఎంకే]] స్థాపించారు. ఆయన మృతిచెందిన ఏడాది తర్వాత రూ.0.15 పైసల తపాలా బిళ్ల విడుదలజేశారు. అన్నా శతజయంత్యుత్సవాల ముగింపు సందర్భంగా రూ.5 నాణేన్ని విడుదలజేశారు.
 
===ఇతర దేశాల్లో===
"https://te.wikipedia.org/wiki/నాణెం" నుండి వెలికితీశారు