తెలుగు శాసనాలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
మరొక వ్యాసం భాగం కాపీ |
||
పంక్తి 1:
{{తెలుగు శాసనాలు}}
అశోకుని శాసనాలలో కనిపించే మౌర్యలిపియే భారతీయ భాషలన్నిటికి మాతృక అనిపిస్తున్నది. అందులోనుండే తెలుగు అక్షరాలు రూపొందినాయనిపిస్తుంది.<ref name="parabrahma"> '''తెలుగు శాసనాలు''' - రచన: జి. పరబ్రహ్మశాస్త్రి - ప్రచురణ: ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ, హైదరాబాదు (1975) [http://www.archive.org/details/TeluguSasanalu ఇంటర్నెట్ ఆర్చీవులలో లభ్యం]</ref> కుబ్బీరకుని [[భట్టిప్రోలు]] శాసనము, [[అశోకుడు|అశొకుని]] ఎఱ్ఱగుడిపాడు (జొన్నగిరి) గుట్టమీది శాసనము ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతంలో లభించే మొదటి వ్రాతలుగా భావిస్తున్నారు. వాటిలోని భాష ప్రాకృతము, లిపి బ్రాహ్మీలిపి.
తరువాత అమరావతిలోని '''నాగబు''' అనే పదము (క్రీ.శ. 1వ శతాబ్ది) , విక్రమేంద్రవర్మ చిక్కుళ్ళ సంస్కృత శాసనంలోని "విజయరాజ్య సంవత్సరంబుళ్" (క్రీ.శ. 6వ శతాబ్ది) మనకు కనిపిస్తున్న మొదటి తెలుగు పదాలు. నాగార్జునకొండ వ్రాతలలో కూడ తెలుగు పదాలు కనిపిస్తాయి. ఇవన్నీ ప్రాకృత శాసనాలు లేదా సంస్కృత శాసనాలు. కనుక తెనుగు అప్పటికి జనసామాన్యంలో ధారాళమైన భాషగా ఉన్నదనడానికి ఆధారాలు లేవు. ఆరవ శతాబ్ది తరువాత బ్రాహ్మీలిపినే కొద్ది మార్పులతో తెలుగువారు, కన్నడంవారు వాడుకొన్నారు. అందుచేత దీనిని "తెలుగు-కన్నడ లిపి" అని పరిశోధకులు అంటారు. <ref name="parabrahma"/>
6,7 శతాబ్దాలలో పల్లవ చాళుక్య సంఘర్షణల నేపధ్యంలో రాయలసీమ ప్రాంతం రాజకీయంగా చైతన్యవంతమయ్యింది. ఈ దశలో [[రేనాటి చోడులు]] సప్తసహస్ర గ్రామ సమన్వితమైన రేనాడు (కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలు) పాలించారు. తెలుగు భాష పరిణామంలో ఇది ఒక ముఖ్యఘట్టం. <ref name="bsl">'''ఆంధ్రుల చరిత్ర''' - రచన: ఆచార్య బి.ఎస్.ఎల్. హనుమంతరావు - ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు (2003)</ref> వారి శాసనాలు చాలావరకు తెలుగులో ఉన్నాయి. వాటిలో [[ధనంజయుని కలమళ్ళ శాసనం]] (కడప జిల్లా కమలాపురం తాలూకా) మనకు లభిస్తున్న మొదటి పూర్తి తెలుగు శాసనంగా చరిత్రకారులు భావిస్తున్నారు. ఇది క్రీ.శ. 575 కాలందని అంచనా. అంతకుముందు శాసనాలలో చెదురు మదురుగా తెలుగు పదాలున్నాయి గాని సంపూర్ణమైన వాక్యాలు లేవు.<ref name="parabrahma"/>
ఆ తరువాత [[జయసింహవల్లభుని విప్పర్ల శాసనము]] క్రీ.శ. 641 సంవత్సరానికి చెందినది. 7,8, శతాబ్దులలోని శాసనాలలో ప్రాకృత భాషా సంపర్కము, అరువాతి కాలంలో సంస్కృత భాషా ప్రభావం అధికంగా కానవస్తాయి. 848 నాటి [[పండరంగుని అద్దంకి శాసనము]]లో ఒక [[తరువోజ]] [[పద్యము|పద్యమూ]], తరువాత కొంత వచనమూ ఉన్నాయి. 934 నాటి [[యుద్ధమల్లుని బెజనాడ శాసనము]]లో ఐదు [[సీసము|సీస]] పద్యాలున్నాయి. 1000 ప్రాంతమునాటిదని చెప్పబడుతున్న [[విరియాల కామసాని గూడూరు శాసనము]]లో మూడు [[చంపకమాల]]లు, రెండు [[ఉత్పల మాల]]లు వ్రాయబడ్డాయి.<ref name="divakarla"/> వీటి ఆధారాల కారణంగా నన్నయకు ముందే పద్య సాహిత్యం ఉండి ఉండాలని నిశ్చయంగా తెలుస్తున్నది. కాని లిఖిత గ్రంధాలు మాత్రం ఇంతవరకు ఏవీ లభించలేదు.
===ధనంజయుని కలమళ్ళ శాసనము==
షుమారు క్రీ.శ. 575 - కమలాపురం తాలూకా - (ఎపిగ్రాఫికా ఇండికా XXVII - పేజి 221 )కు చెందిన ఈ శాసనం మనకు లభించే మొట్ట మొదటి పూర్తి తెలుగు శాసనం.
<pre>
..........
కల్ము[తు]రా
జు ధనంజ
యుదు రేనా
ణ్డు ఏళన్
చిఱుంబూరి
రేవణకాలు [పం]
పు చెనూరుకాజు
అఱి కళా ఊరి [-]
ణ్డవారు ఊరి ... ...
... ....
..... ... పఞ్చ [మ]
హా పాతకస
కు
</pre>
''ఎరికల్ మహారాజు ధనంజయుడు రేనాడును ఏలుతుండగా చిఱుంబూరు అనే గ్రామానికి చెందిన రేవణ అనే ఉద్యోగి పంపున చెనూరు గ్రామానికి చెందిన 'కాజు' (వాక్యం అసంపూర్ణం) - ఈ ధర్మం చెడగొట్టువాడు పంచమహాపాతకుడగును'' - అని కావచ్చును.
* '''పుణ్యకుమారుని తిప్పలూరి శాసనము''' - 630 - - కమలాపురం తాలూకా - ఎపిగ్రాఫికా ఇండికా XXVII - పేజి 231
* '''సత్యాదిత్య చోళుని మాలెపాడు శాసనము''' - 725 - - ఎపిగ్రాఫికా ఇండికా XI - పేజి 345
* '''అరకట వేముల శాసనము''' - 8వ శతాబ్దం - ప్రొద్దుటూరు తాలూకా -
* '''వేల్పుచర్ల శాసనము''' - జమ్మలమడుగు తాలూకా -
* '''గణ్డ త్రిణేత్ర వైదుంబ మహారాజు వన్దాడి శాసనము''' - రాయచోటి తాలూకా -
* '''కొండపఱ్తి శాసనం''' - 9వ శతాబ్దం - వరంగల్ వద్ద
* '''కొరవి శాసనం''' - 935 - వరంగల్ జిల్లా మానుకోట (మహబూబాబాదు)
* '''పణ్డరంగుని అద్దంకి శాసనము''' - 770 - అద్దంకి
* '''యుద్ధమల్లుని బెజవాడ శాసనము''' - 930 - విజయవాడ
* '''జినవల్లభుని కుర్క్యాల శాసనము''' - 945 - కరీంనగర్ జిల్లా కుర్క్యాల
* '''బణపతి దీర్ఘాసి శాసనము''' - 997 - కళింగపట్నం
* '''విరియాలవారి గూడూరు శాసనము''' - 1124 - జనగామ తాలూకా, గూడూరు
===పండరంగని అద్దంకి శాసనము (క్రీ.శ. 848) ===
Line 48 ⟶ 106:
-->
==మూలాలు==
[[వర్గం:జాబితాలు]]
|