నాగానందము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
ఒకనాడు పర్ణశాల కోసం మలయ పర్వతం అనే కొండమీదకి వెళ్ళాడు. అక్కడ గౌరీదేవి ని కమ్మని వీణాగానంతో ప్రార్ధిస్తున్న మలయవతిని చూచి, ప్రేమించి, వివాహం చేసుకున్నాడు. అలా పర్వతం మీద విహరిస్తుందగా అతనికి ఒక తెల్లని కొండలాగా కనిపిస్తున్న [[పాము]]ల ఎముకలగుట్ట కనిపించి ఆశ్చర్యాన్ని కలిగించింది. అన్ని పాములకు తానేమీ సహాయం చేయనందుకు బాధపడ్డాడు. అక్కడే విలపిస్తున్న ఒక తల్లిని చూశాడు. విషయం తెలుసుకోవడానికి వివరాలు అడుగగా ఈ రోజు గరుత్మంతునికి తన కొడుకు శంఖచూడుడు ఆహారంగా వెళుతున్నట్లు చెప్పింది. గరుత్మంతుడికి పాములంటే విరోధం ఉండేది. అతడు నాగలోకం మీదపడి పాముల్ని కనికరం లేకుండా తినేవాడు. అప్పుడు నాగరాజైన [[వాసుకి]] గరుత్మంతునికి ప్రతిరోజు ఒక పామును ఆహారంగా పంపుతానని ప్రార్ధించి ఒప్పించాడు. ఈ రోజు నా కొడుకు వంతు అని వివరించింది.
 
అప్పుడు శంఖచూడునికి బదులుగా నేను గరుత్మంతునికి ఆహారంగా వెళతాను అని అవ్వకి మాటిచ్చి బలిపీఠమైన పెద్దబండ మీద జీమూతవాహనుడు పడుకొన్నాడు. [[గరుత్మంతుడు]] బండమీది జీమూతవాహనున్ని తినడం మొదలుపెట్టాడు. కొంతసేపటి తర్వాత ఏదో పొరపాటు జరిగినట్లుగా సందేహం కలిగి తినడం ఆపి తాను తింటున్నది జీమూతవాహనుని అని తెలిసి జరిగిన పొరపాటుకు తన్నుతాను తిట్టుకున్నాడు. శంఖచూడుడు చిన్నపిల్లవాడిలా ఏడుస్తూ అక్కడే కూర్చున్నాడు. జీమూతవాహనుని భార్య, తల్లిదండ్రులూ చేరి ఏడుస్తున్నారు. ఎలాగైనా వారి దు॰ఖాన్ని పోగొట్టాలని అప్పుడే తనకు మనశ్శాంతి కలుగుతుందని దేవలోకం వెళ్ళి [[అమృతం]] తీసుకొని వచ్చి జీమూతవాహనున్ని బ్రతికించాడు. అందరూ సంతోషించారు. అప్పుడు జీమూతవాహనుడు గరుత్మంతుని శక్తిసామర్ధ్యాలను పొగిడి, తనను బ్రతికించినట్లే చనిపోయిన పాములన్నింటినీ బ్రతికించి పుణ్యం కట్టుకోమని ప్రార్థించాడు. అందుకు గరుత్మంతుడు అంగీకరించి తాను తెచ్చిన అమృతంతో పాములన్నింటిని బ్రతికించాడు.
అప్పుడు శంఖచూడునికి బదులుగా నేను గరుత్మంతునికి ఆహారంగా వెళతాను అని అవ్వకి మాటిచ్చి బలిపీఠమైన పెద్దబండ మీద జీమూతవాహనుడు పడుకొన్నాడు.
 
==అనువాదం==
"https://te.wikipedia.org/wiki/నాగానందము" నుండి వెలికితీశారు