దేవికారాణి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
జర్మనీలో ప్రసిద్ధ సినీ నిర్మాతగా పేరుపొందిన [[హిమాంశు రాయ్]] తో పరిచయం ఏర్పడి తర్వాత అది ప్రేమగా మారి 1929లో పెళ్ళి చేసుకున్నారు. బెర్లిన్ లోని యు.ఎఫ్.ఎ. స్టూడియోలో దేవికని చేర్పించి మేకప్, కాస్ట్యూమ్ డిజైనింగ్ మొదలైన విభాగాల్లో శిక్షణ ఇప్పించారు.
 
స్వదేశానికి తిరిగివచ్చి స్వంతంగా "కర్మ" (1933) అనే చిత్రాన్ని నిర్మించారు. దేవికారాణి నాయికగా మరియు హిమాంశురాయ్ నాయకునిగా దీనిని హిందీలోకి అనువదించి విడుదల చేయగా ఘనవిజయం సాధించింది.
 
1934లో "బాంబే టాకీస్" అనే సంస్థను స్థాపించి ఎందరో ఔత్సాహిక కళాకారుల్ని చేర్చుకొని వివిధ రంగాల్లో శిక్షణనిచ్చారు. బాంబే టాకీస్ తీసిన చిత్రాలలో దేవికారాణి మరియు [[అశోక్ కుమార్]] ల జంట హిట్ పెయిర్ గా పేరుపొందారు. ఈమె నటించిన 16 చిత్రాలలోని చాలా పాత్రలు సంఘర్షణాత్మకమైనవి. సమాచ వివక్షతకు గురయ్యే హరిజన యువతిగా ''అచూత్ కన్య'' (1936) లో, తల్లికాలేని గృహిణిగా ''నిర్మల'' (1939) లో, అనాధగా ''దుర్గ'' (1939), తిరగబడిన మహిళగా ''సావిత్రి'' (1937) లో విధివంచితురాలైన బ్రాహ్మణ యువతిగా ''జీవన్ ప్రభాత్'' (1937) లో ఆమె నటన అనితర సాధ్యమైనది.
 
మే 19, 1940లో హిమాంశు రాయ్ హఠాన్మరణం పొందడంతో బాంబే టాకీస్ నిర్వహణ బాధ్యత ఆమె చేతిలో పడింది. తర్వాత తీసిన ''బసంత్'', ''కిస్మత్'', ''అంజానా'' మొదలైన చిత్రాలు ఆర్థికంగా లాభాలు తెచ్చిపెట్టాయి.
"https://te.wikipedia.org/wiki/దేవికారాణి" నుండి వెలికితీశారు