కోదాటి నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కోదాటి నారాయణరావు''' ([[డిసెంబరు 15]], [[1914]] - [[నవంబరు 11]], [[2002]]) గ్రంథాలయోద్యమం నేత మరియు విశాలాంధ్ర ప్రచారకులు.
 
వీరు [[నల్గొండ జిల్లా]] [[రేపాల]] గ్రామంలో జన్మించారు. ఆర్ధికవీరి కారణాలతండ్రి వలనరంగారావు మెట్రిక్గారు రేపాల కరణంగా చేసేవారు. రేపాలలోని శ్రీ లక్ష్మీనరసింహ మనోహర బాలభారతీ పుస్తక భాండాగారం బాల్యం నుండే అతన్ని ఆకర్షించింది. దాని కార్యకర్తగా గ్రంథాలయ మంచి చెడ్డలు చూసేవారు. ప్రాథమిక తర్వాత సూర్యాపేటలో మెట్రిక్ పూర్తిచేశారు. ఆర్ధిక కారణాల వలన సాయం కళాశాలలో చేరి పట్టా మరియుపొందారు. ఎల్.ఎల్.బి. పూర్తిచేశారు. వీరు కొంతకాలం [[గోలకొండ]] పత్రికలో పనిచేసి, జర్నలిజంపై ఆసక్తి కలిగి మందుకుల నరసింగరావు సంపాదకత్వంలోని "రయ్యత్" పత్రికలో ఏజెంట్ గా పనిచేశారు. తర్వాత ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీ ఏజన్సీ తీసుకోవడంతో ప్రజా జీవనంతో సంబంధంలో ఏర్పడింది. వీరు అస్పృశ్యతా నివారణోద్యమం, [[గ్రంథాలయోద్యమం]], జాతీయోద్యమం లలో ప్రముఖ పాత్ర పోషించారు. [[ఖమ్మం]]లోని [[విజ్ఞాన నికేతన గ్రంథాలయం]] ఆయన కృషి వలన స్థాపించబడినది. గ్రంథాలయోద్యమం ద్వారా విశాలాంధ్రకు నాందిపలికాడు. విజ్ఞాన నికేతనానికి జరిగే వార్షికోత్సవాల ద్వాతా నిజాం మరియు బ్రిటిష్ వారిలో ప్రముఖులను కోదాటి సమావేశపరిచేవారు.
 
1944లో [[ఇల్లెందు]]లో 25వ ఆంధ్ర గ్రంథాలయ మహాసభకు [[బూర్గుల రామకృష్ణారావు]] అధ్యక్షతన జరిగింది. [[కోస్తా]], [[రాయలసీమ]], [[తెలంగాణ]] ప్రాంతాల నుండి అనేకమంది ప్రముఖులు విచ్చేశారు. [[విశాలాంధ్ర]] స్వరూపాన్ని ఆ సభ ప్రతిబింబించింది. గ్రంథాలయోద్యమం యావదాంధ్ర దేశానికి ప్రాతినిధ్యం వహించే ఉద్యమంగా మారింది.
పంక్తి 8:
 
[[హైదరాబాద్]] లోని రెడ్డి హాస్టల్ లో 10వ [[ఆంధ్ర మహాసభ]] జరుగుతున్న సమయంలో నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్తు స్థాపించారు. పోలీసు చర్య అనంతరం [[ఆలంపురం]]లో జరిగిన ఉత్సవాలలో పరిషత్తు పేరును [[ఆంధ్ర సారస్వత పరిషత్తు]]గా మార్చారు.
 
తెలంగాణా ఉద్యమంలో కోదాటి, [[కాళోజీ]], [[కొమరగిరి నారాయణరావు]] గారలు ఎంతో సన్నిహితంగా ఉండేవారు. వీరిని ''నారాయణ త్రయం'' లేదా ''కకారత్రయం'' అనేవారు.
 
ఆంధ్ర రాష్ట్ర, అఖిల భారత కాంగ్రెస్ సభ్యులుగా ఉన్నారు. కొంతకాలం రాష్ట్ర స్థాయి సహకార సంఘానిని అధ్యక్షులుగా పనిచేశారు. ఇవికాక [[ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంస్థ]] అధ్యక్షునిగా, [[గాంధీ స్మారక నిధి]] కార్యదర్శిగా, [[గాంధీ భవన్]] మేనేజింగ్ ట్రస్టీగా ఆయన వ్యవహరించారు. కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం అధ్యక్షులుగా, భాగ్యనగర ఖాదీ సమితి కార్యదర్శిగా కూడా పనిచేశారు.
"https://te.wikipedia.org/wiki/కోదాటి_నారాయణరావు" నుండి వెలికితీశారు