హరిశ్చంద్ర (1956 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
}}
 
==కథాంశం==
 
హరిశ్చంద్రుడు(ఎస్వీ రంగారావు) తన రాజ్యంలో ప్రజలకు న్యాయం చేకూరుస్తూ సపరిపాలన చేస్తూవుంటాడు. ఇంద్రలోకంలో వశిష్టమహామునిని ఇంద్రుడు(కల్యాణం రఘురామయ్య) భూలోకంలో సత్యపాలకుడు ఎవరైనావున్నారా అని అడగగా మునివర్యుడు హరిశ్చంద్రుడు అని జవాబు చెప్పుతాడు. దానికి విశ్వామిత్రుడు(గుమ్మడి) మండిపడుతూ హరిశ్చంద్రుడిని సత్యభ్రష్టుడిని చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. అందుకని ముందు అయోధ్య రాజ్యంలో తన తపశ్శక్తితో మృగసంచారం పెంచుతాడు. ఈ విషయం ప్రజలు హరిశ్చంద్రుని చెవిన వేస్తారు. అందుకని హరిశ్చంద్రుడు రాణి చంద్రమతి(లక్ష్మీరాజ్యం), యువరాజు మరియు మహామంత్రితో సహా వేటకు వెళ్ళతాడు. విశ్వామిత్రుడు తన శక్తితో ఇద్దరు మాతంగకన్యలను సృష్టించి హరిశ్చంద్రుడిని ధర్మమార్గం నుండి మళ్లించుటకు తన శిష్యుడిని(రేలంగిని) వారికి తోడుగా పంపిస్తాడు. కాని వారు పరాభావం పొందుతారు.