హరిశ్చంద్ర (1956 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
 
==కథాంశం==
హరిశ్చంద్రుడు (ఎస్వీ రంగారావు) తన రాజ్యంలో ప్రజలకు న్యాయం చేకూరుస్తూ సపరిపాలన చేస్తూ వుంటాడు. ఇంద్రలోకంలో వశిష్ట మహామునిని ఇంద్రుడు (కల్యాణం రఘురామయ్య) భూలోకంలో సత్యపాలకుడు ఎవరైనా వున్నారా అని అడగగా మునివర్యుడు హరిశ్చంద్రుడు అని జవాబు చెప్పుతాడు. దానికి విశ్వామిత్రుడు (గుమ్మడి) మండిపడుతూ హరిశ్చంద్రుడిని సత్యభ్రష్టుడిని చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. అందుకని ముందు అయోధ్య రాజ్యంలో తన తపశ్శక్తితో మృగ సంచారం పెంచుతాడు. ఈ విషయం ప్రజలు హరిశ్చంద్రుని చెవిన వేస్తారు. అందుకని హరిశ్చంద్రుడు రాణి చంద్రమతి (లక్ష్మీరాజ్యం), యువరాజు రోహితాశ్వుడు మరియు మహామంత్రితో సహా వేటకు వెళ్ళతాడు. విశ్వామిత్రుడు తన శక్తితో ఇద్దరు మాతంగ కన్యలను సృష్టించి హరిశ్చంద్రుడిని ధర్మమార్గం నుండి మళ్లించుటకు తన శిష్యుడు నకచకుడిని (రేలంగిని) వారికి తోడుగా పంపిస్తాడు. కానీ వారు పరాభావం పొందుతారు. ఇది తెలిసిన విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడిని మాతంగ కన్యలను వివాహమాడమని ఆజ్ఞాపిస్తాడు. కానీ హరిశ్చంద్రుడు తాను ధర్మమార్గం నుండి తప్పనని చెప్పుతాడు, ఇంకేదైనా విషయం అడగమని చెప్పగా అతనిని తన రాజ్యానిని దానం చేయమని అంటాడు, దక్షిణగా ఇవ్వటానికి అతని దగ్గర ఏమీ లేక పోవటంతో ఎదైనా పని చేసి ఋణాన్ని తీర్చడానికి సిద్ధమవుతాడు. వారి వెంట తన శిష్యుడు నకచకుడిని పంపిస్తాడు విశ్వామిత్రుడు. అలా వారు కాశీకి చేరుకుని కాశీనాథుడిని దర్శించుకుంటారు. తర్వాత విశ్వామిత్రుని ఋణాన్ని ఎలా తీర్చాలని ఆలోచిస్తుండగా చంద్రమతి తనను అమ్మేసి వచ్చిన డబ్బుతో ఋణాన్ని తీర్చమంటుంది. దానికి హరిశ్చంద్రుడు ముందు అంగీకరించడు, కానీ అంగీకరించవలసి వస్తుంది. చంద్రమతిని అమ్మడానికి తీసుకెళ్ళగా ఒక బ్రాహ్మణుడు ఆమెతో పాటు వారి పుత్రుడిని కూడ ఇవ్వమని పట్టుబడుతాడు, వారు తప్పక అలానే చేయవలసి వస్తుంది. ఆ బ్రాహ్మణుని భార్య (సూర్యకాంతం) పరమ గయ్యాళి చంద్రమతి మరియు ఆమె కొడుకుని ఏంతో బాధ పెడుతుంది. మరో వైపు హరిశ్చంద్రుడు తనను కూడా అమ్మేసి డబ్బుని విశ్వామిత్రునికివ్వమని నకచకుడిని కోరతాడు. తప్పనిసరి పరిస్తితులలో హరిశ్చంద్రుణ్ణి ఒక కాటికాపరికి అమ్మేస్తాడు. ఒకసారి చంద్రమతి తన కొడుకుని కొందరితో చిన్న పనికి దారిలో అతన్ని పాము కాటువేయగా మరణిస్తాడు. అలా కాటు వేయమని విశ్వామిత్రుడు చెప్పుతాడు. చంద్రమతి తన కొడుకు మృతదేహాన్ని దహనం చేయటానికి స్మశానానికి తీసుకువెళ్తుంది. హరిశ్చంద్రుడు ముందు వారిని గుర్తించడు, గుర్తించిన తరువాత బాధతో కుంగిపోతాడు. ఉద్యోగధర్మం గుర్తుకు వచ్చి శిస్తు చెల్లించనిదే దహన సంస్కారాలను జరుపవలదని చెప్పుతాడు, చివరికి చంద్రమతి చీరను ఇవ్వమంటాడు, అప్పటికే సగం చీరను తన కొడుకు మృతదేహాన్ని కప్పు టకు చించివున్నది. తన చీరను విప్పబోగ విశ్వామిత్రునితో పాటు దేవుళ్ళందరూ ప్రత్యక్షమవుతారు. హరిశ్చంద్రుడిని వారు పొగిడి అతని సత్యానికి అతనికి స్వర్గంలో చోటు కల్పిస్తారు. కానీ హరిశ్చంద్రుడు తన యజమానిని వదిలిపెట్టి రానంటాడు. అప్పుడు వారు హరిశ్చంద్రుని యజమాని యముధర్మరాజని చెప్పుతారు. అయినా తన ప్రజలను వదిలిపోవడం క్షత్రియధర్మంకు విరుద్ధమని, వారు లేనిదే తానూ రానని తేల్చి చెప్పేస్తాడు. కానీ దేవతలు దానికి ఒప్పుకోరు. అప్పుడు హరిశ్చంద్రుడు తన ప్రజలకొరకు ఏమైనా చేయడానికి సిద్ధమవుతాడు. దేవతలు అతని కోరికను మన్నించి వారందరిని స్వర్గానికి పంప్పిస్తారు. విశ్వామిత్రుడు రోహితాశ్వుడిని అయోధ్యకు రాజుని చేసి మళ్ళీ అయోధ్యలో ప్రజలను సృష్టిస్తాడు.
 
==పాటలు==