తొలిఏకాదశి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఏ మంచిపని ప్రారంభించినా దశమి ఏకాదశులకోసం ఎదురుచూడటం ప్రజలకు అలవాటు.ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో , ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు.వానకారు మొదలైతే అనారోగ్యాలు తలెత్తడం సహజం. శరదృతువు యమ దంష్ట్రిక (యముడి కోర). ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండుగలూ పబ్బాలూ ఎక్కువ. లంఖణం పరమ ఔషధం అనే ఉపవాస దీక్షకు నాంది తొలి ఏకాదశి. [[ఆషాఢమాసము]] శుక్లపక్ష [[ఏకాదశి]] నాడు [[విష్ణుమూర్తి]] పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్బాన్ని '''తొలిఏకాదశి'''గా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని [[శయన ఏకాదశి]] అని కూడా అంటారు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు. తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని పురాణప్రతీతి.ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. దానిని [[ఉత్థాన ఏకాదశి]] అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే [[క్షీరాబ్ధి ద్వాదశి]] అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ [[చాతుర్మాస్యదీక్ష]] చేసేవారు. ఏకాదశీ వ్రతాన్ని ఆచరించే రుక్మాంగదుడు- మోహిని రూపంలో వచ్చి ఏకాదశిపూట పొందుకోరిన రంభను తిరస్కరించాడట.ప్రస్తుతం మఠాధిపతులూ, సన్యాసం తీసుకున్నవారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. చతుర్మాస్యదీక్ష చేపట్టినవారు నాలుగునెలలపాటు ప్రయాణాలు చేయరు. కామ క్రోధాదులను విసర్జిస్తారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు.[[జొన్న]] [[పేలాలు]] [[బెల్లం]] కలిపి దంచి పిండి చేస్తారు. రైతులు ఆరోజున ఖచ్చితంగా [[పేలపిండి]] తింటారు.ఏకాదశినాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది.
[[ఆషాఢమాసము]] శుక్లపక్ష [[ఏకాదశి]] నాడు [[విష్ణుమూర్తి]] పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్బాన్ని '''తొలిఏకాదశి'''గా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని [[శయన ఏకాదశి]] అని కూడా అంటారు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు.
 
తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని పురాణప్రతీతి.
 
ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. దానిని [[ఉత్థాన ఏకాదశి]] అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే [[క్షీరాబ్ధి ద్వాదశి]] అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ [[చాతుర్మాస్యదీక్ష]] చేసేవారు. ప్రస్తుతం మఠాధిపతులూ, సన్యాసం తీసుకున్నవారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. చతుర్మాస్యదీక్ష చేపట్టినవారు నాలుగునెలలపాటు ప్రయాణాలు చేయరు. కామ క్రోధాదులను విసర్జిస్తారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు.[[జొన్న]] [[పేలాలు]] [[బెల్లం]] కలిపి దంచి పిండి చేస్తారు. రైతులు ఆరోజున ఖచ్చితంగా [[పేలపిండి]] తింటారు.
 
 
"https://te.wikipedia.org/wiki/తొలిఏకాదశి" నుండి వెలికితీశారు