దక్షిణామూర్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
'''దక్షిణామూర్తి''' [[శివుడు|పరమశివుని]] జ్ఞానగురువు అవతారం. ఇతర [[గురువు]]లు మాటలతో శిష్యులకు బోధిస్తారు. కానీ దక్షిణామూర్తి [[మౌనం]]గానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలు నివారిస్తాడు.
 
బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించినప్పుడు మొదట సనక,సనందన,సనత్సుజాత మరియు సనత్కుమారులను సృష్టించాడు. వారిని తన సృష్టిని కొనసాగించమన్నాడు. కాని వారికి ఇష్టం లేక మేము బ్రహ్మజ్ఞానం పొందాలి, అందువలన మేము మీకు సాయపడలేము అని విరక్తులై బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి గురువును వెదుకుతూ బయలుదేరారు. ఇక బ్రహ్మగారు మరో ప్రత్యామ్నాయంతో తన సృష్టిని కొనసాగించాడు.
సనకసనందాది మునీంద్రులు చాలాకాలం తపస్సు చేసి కూడా బ్రహ్మతత్త్వాన్ని నిర్ణయించుకోలేకపోయారు. బ్రహ్మదేవుని అడుగుదామని బ్రహ్మలోకానికి వెళ్ళారు. అక్కడ చతుర్ముఖుడు సరస్వతీ సమేతుడై ఉండడం చూచి వెనుదిరిగారు. వైకుంఠానికి పోగా అక్కడ మహావిష్ణువు లక్ష్మీ సమన్వితుడై కనిపించాడు. ఆ దేవుని మీద కూడా వారికి విశ్వాసం కలుగలేదు. ఆ తరువాత వారు కైలాసానికి వెళ్ళారు. అక్కడ వటవృక్షం క్రింద వ్యాఘ్రాసనాసీనుడై శుద్ధ జ్ఞానైక ముర్తిగా శివుడు సాక్షాత్కరించాడు. ఆ మూర్తియే దక్షిణామూర్తి. ఆయనను దర్శించి తమకు సరియైన గురువు లభించాడని సంతుష్టులై ఆదిదేవునికి శిష్యత్వం వహించారు.
 
ఇక ఈ నలుగురూ గురువుకోసం వెదుకుతూ నారదమహర్షి సహాయంతో మొదట బ్రహ్మ గారినే అడుగుదామనుకొన్నారు. కాని ప్రక్కన సరస్వతీదేవిని చూసి " ఈయనే పెళ్ళి చేసుకొని సంసారంలో ఉన్నారు. ఇక ఈయన మనకు ఏమని ఉపదేశిస్తాడు" అని అనుకొని బ్రహ్మను అడుగలేదు. అలాగే మహావిష్ణువునూ మరియు పరమశివుడనూ కూడా అడుగుదామని వెళ్ళి వారి ప్రక్కన లక్ష్మీదేవినీ మరియు పార్వతీదేవినీ చూసి వారిని కూడా అడుగలేదు.
 
పరమశివుడు ఈ నలుగురి అజ్ఞానాన్ని చూసి బాధపడి వారికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాలనుకొని అనుకొన్నాడు. వారు వెళ్ళే దారిలో ఒక మర్రిచెట్టు క్రింద దక్షిణామూర్తిగా కూర్చున్నాడు. వీరు నలుగురూ ఆ మూర్తిని చూసి అతని తేజస్సుకు ఆకర్షితులై ఆయన చుట్టూ కూర్చున్నారు. దక్షిణామూర్తి స్వామి వారు తమ మౌనంతోనే వారందరినీ బ్రహ్మజ్ఞానం పొందునట్లు చేసారు. అలా మౌనముగా ఎందుకు భోధించారంటే బ్రహ్మము లేక పరమాత్మ మాటలకు,మనసుకూ అందనివారు కాబట్టి అలా భోధించారు.
 
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/దక్షిణామూర్తి" నుండి వెలికితీశారు