గణపతి దేవుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
దేవగిరి ఏలుతున్న యాదవ రాజు జైత్రపాలుడు 1195 లో కాకతీయ రుద్రదేవుని వధించి గణపతిదేవుని బంధిస్తాడు. రుద్రదేవుని తమ్ముడు మహాదేవుడు ఓరుగల్లు సింహాసనమెక్కి మూడు వర్షములు (1196-1198 CE) పాలిస్తాడు. 1198లో గణపతిని విడిపించుటకు దేవగిరిపై దండెత్తి విజయము సాధిస్తాడు కాని తన ప్రాణాలు కోల్పోతాడు. మహాదేవుని మరణానంతరము రాజ్యములో అరాచకము చెలరేగుతుంది. మహాదేవుని కుమారుడైన గణపతిదేవుడు 1198లో రాజ్యానికి వస్తాడు.<ref>ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర, ఏటుకూరి బలరామమూర్తి రచన, 10వ ముద్రణ (1990) పేజీ 113 </ref>సేనాధిపతి రేచెర్ల రుద్రుడు తన శక్త్తియుక్తులు ధారపోసి రాజ్యము చక్కదిద్దుతాడు. గణపతిదేవుడు పాలించిన 62 సంవత్సరములు తెలుగు దేశ చరిత్రలో కొనియాడదగినవి.
==పాలనా విధానం==
కాకతీయ గణపతిదేవుడు రాజ్యానికి రాకముందు 12 సంవత్సరాలు దేవగిరి యాదవుల వద్ద బందీగా ఉన్నాడు. ఈ కాలంలో సామతరాజులు ఎన్నో తిరుగుబాట్లు చేశారు. ఈ తిరుగుబాట్లను సేనాని రేచర్ల రుద్రుడు అణచివేశాడు. విడుదలైన పిదప రేచర్ల రుద్రుడు కాకతీయ రాజ్యాన్ని గణపతిదేవుడికి అప్పగించాడు. గణపతిదేవుని పాలనలో [[వ్యవసాయము]] మరియు వర్తకాలు బాగా వృద్ధిచెందాయి. గణపతిదేవుడు వర్తకులకు ప్రాత్సహించాడు. మోటుపల్లిలో వేయించిన అభయశాసనం దీనికి నిదర్శనం. గణపతిదేవుడు కాకతీయ రాజధానిని [[హన్మకొండ]] నుండి [[ఓరుగల్లు]]కు మార్చినాడు. వ్యవసాయము వృద్ధిచెందడానికి నీటిపారుదల కల్పించుటకు ఇతని సేనాని పాకాల చెరువును కట్టించాడు. మరో సేనాని గౌండ సముద్రాన్ని నిర్మించాడు.
===రాజ్యవిస్తరణ===
గణపతిదేవుడు రాజ్యవిస్తరణకు ప్రాధాన్యత ఇచ్చాడు. ఇందుకోసం సైనిక బలంపైనే కాకుండా సరిహద్దు రాజ్యాల రాజకుటుంబాలతో సంబంధాలుపెట్టుకున్నాడు. 1212లో తూర్పు తీరంపై దండయాత్ర చేసి కృష్ణా, గోదావరి గుంటూరులను స్వాధీనం చేసుకున్నాడు.నిడదవోలును పాలిస్తున్న వేంగీచాళుక్య రాజు వీరభద్రుడికి తన కూతురు రుద్రమదేవినిచ్చి వివాహం చేశాడు. మరో కూతురు గణపాంబను ధరణికోట రాజు బేతరాజుకు ఇచ్చి వివాహం జరిపించాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/గణపతి_దేవుడు" నుండి వెలికితీశారు