పి.ఎన్.ఎస్. ఘాజీ: కూర్పుల మధ్య తేడాలు

లింకు సరిచేసాను
చి చిన్నమార్పు చేసాను
పంక్తి 2:
'''పి.ఎన్.స్. ఘాజీ''' [[పాకిస్తాన్]] దేశపు నౌకా దళానికి చెందిన జలాంతర్గామి. [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా సంయుక్త రాష్ట్రాల]] ద్వారా నిర్మించబడిన ఈ [[జలాంతర్గామి]] అసలు పేరు యు.ఎస్.ఎస్ డయాబ్లో గా 1944 నుండి 1963 వరకు సేవలందించిన ఈ జలాంతర్గామి పిదప పాకిస్థాన్ దేశానికి లీజు కింద ఇవ్వడం జరిగింది.
 
[[భారత్ పాక్ యుద్ధం 1965|1965 ఇండో-పాక్ యుద్ధం]] లో భారత నౌకా దళాలకు సవాలుగా మిగిలిన ఈ జలాంతర్గామి పాకిస్థాన్ నౌకా దళానికి విశేషసేవలందించింది. 1971 ఇండో-పాక్ యుద్ధం సమయంలో ఘాజీ ను తూర్పు-పాకిస్థాన్([[బంగ్లాదేశ్]]) విముక్తి కోసం సేవలందిస్తున్న [[ఐ.ఎన్.ఎస్. విక్రాంత్]] కు విరుగుడు గా నియోగించింది. నవంబరు 14 1971 న [[కరాచీ]] పోర్టు నుండి బయలుదేరిన ఘాజీ, 3000 కి.మీ.లు [[అరేబియా సముద్రం]] నుండి [[హిందూ మహా సముద్రం]] మీదుగా ప్రయాణించి, బంగాళాఖాతపు భారత జలాలలో ప్రవేశించింది. అయితే ఘాజీ ఉనికిని ముందే పసిగట్టిన భారత నౌకాదళం విక్రాంత్ ను అండమాన్ దీవులకు తరలించటం, విక్రాంత్ జాడ కనుగొనలేక ఘాజీ తన కార్యాచరణ లో విఫలం కావడం జరిగింది. తదుపరి లక్ష్యం కింద "[[విశాఖపట్టణం]]" లోని భారత తూర్పు నావికా దళ ముఖ్య విభాగాన్ని ముంచి వేసే ఆలోచన తో విశాఖ నగర జలాల్లో పొంచి ఉండగా, భారత నావికా దళం దాడి కి గురై 4 డిసెంబరు 1971 న విశాఖ సమీపాన మునిగిపోయింది. 92 మంది నావికులు కల ఈ జలాంతర్గామి మునక భారత ఉపఖండం లోని తొలి నావికాదళ-ప్రమాదంగానూ, 1975 ఇండో-పాక్ యుద్ధం లో పాకిస్థాన్ కు తీరని ఓటమి నూ మిగిల్చించిన ఈ జలాంతర్గామి మునక భారత నావికాదళ విజయాలలో పేరెన్నిక గన్నది.
 
ఇప్పటికీ ఈ జలాంతర్గామి విశాఖనగర సమీప జలాలలో సముద్రపు అట్టడుగున బురద లో కూరుకొని ఉంది.
"https://te.wikipedia.org/wiki/పి.ఎన్.ఎస్._ఘాజీ" నుండి వెలికితీశారు