గుణసుందరి కథ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
[[బొమ్మ:Gunasundari-katha-1.jpg | 250px | thumb | left | గుణ సుందరి కధ సినిమా నుండి ఒక సన్నివేశము]]
==కధా గమనం==
ఈ కధ [[పార్వతీ|పార్వతి]] [[పరమేశ్వరులు|శివుడు]] విహారం చేస్తూ వెళుతుండగా మొదలౌతుంది. ఒక యువతి ఏడుస్తూ దేవిని ప్రార్ధిస్తూ ఉండటం ఆమె ప్రక్కన ఒక [[బల్లూకం|ఎలుగుబంటి|ఎలుగు]] కూర్చొని ఉండటం చూసి పార్వతి ఆమె కధ వివరించమని పరమేశ్వరుని వేడుకొంటుంది. ఆయన ఆక్ధను వివరిస్తూ ఉంటాడు.
 
==మూల కధ==
ధారానగరఅన్ని పరిపాలించే [[రాజు]] ఉగ్రసేనునికి హేమసుందరి, రూపసుందరి మరియు గుణసుందరి అనే ముగ్గురు కుమార్తెలు ఉంటారు. గుణ సుందరి([[శ్రీరంజని]])కి జన్మనిస్తూ ఆమె తల్లి చనిపోవడంతో రాజు మళ్ళీ వివాహం తలపెట్టక ముగ్గురు కుమార్తెలనూ అల్లారు ముద్దుగా పెంచుతుంటాడు. ముగ్గురు కుమార్తెలూ యవ్వనవతులైనాక ప్రజలకు పరిచయం చేసేందుకు [[సభ]]కు తీసుకొస్తాడు. అక్కడ వారిని తనగురించి చెప్పమన్నపుడు పెద్దకుమార్తెలు [[తండ్రి]]ని తాము అందరికంటె ఎక్కువగా ప్రేమిస్తామని, గౌరవిస్తామని చెపుతారు. గుణసుందరి తాను తండ్రిపై గౌరవం అభిమానం ఉన్నాయని కాని తను తన భర్తనే అందరి కంటే అధికంగా ప్రేమించాలని చెపుతుంది. దానితో కోపం వచ్చిన రాజు నీ [[భర్త]] ఎవరైనా ప్రేమిస్తావా అని అడుగుతాడు. ప్రేమిస్తానని చెప్పటంతో రాజ్యంలోని కుంటీ, గుడ్డీ, మూగ, చెవిటి వాళ్ళనందరినీ తెప్పించి వారిలో అన్ని అవలక్షణాలు కల ఒక ముసలి([[కస్తూరి శివరావు]])ని ఇచ్చి ఆమెకు వివాహం జరుపుతాడు. అదే మూహూర్తంలో ఆమె అక్కలకు తన మేనళ్ళుళ్ళతో వివాహం జరుపుతాడు.
"https://te.wikipedia.org/wiki/గుణసుందరి_కథ" నుండి వెలికితీశారు