ప్రకాష్ ఆమ్టే: కూర్పుల మధ్య తేడాలు

చి లోక్ బిరాదరి ప్రకల్ప్- లింకు
పంక్తి 5:
[[http://viswiki.com/en/Lok_Biradari_Prakalpలోక్ బిరాదరి ప్రకల్ప్]]
==సేవా భాగ్యం==
[[Madia_Gond_Family_12_x_9.JPG|thumb|right|200px|గోండు కుటుంబం]]
అప్పటి దాకా సకల సౌకర్యాలతో పట్టణంలో జీవించిన యువ దంపతులు ఒక్కసారిగా [[విద్యుత్తు]], [[టెలిఫోన్]], సౌకర్యాలు లేని ఒక తలుపు లేని గుడిసె లోకి మారారు. రోడ్డు పక్కనే వైద్య సేవలు చేసేవారు. రాత్రివేళ చలి వేస్తే కట్టెలతో మంట వేసుకుని చలి కాసుకునే వారు. గోండులు కొత్తవాళ్ళని అసలు నమ్మేవారు కాదు. నాగరికులంటే వారికి అకారణమైన భయం. దానికి తోడు వాళ్ళ మాట్లాడుకునే మడీయా భాషకు లిపి లేదు. ఈ భాషకు హిందీ, మరాఠీ భాషకు పోలికే లేదు. కొన్ని పదాలను మాత్రం తెలుగు భాషనుంచి అరువు తెచ్చుకున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలాకాలం నుంచి పని చేస్తున్న అటవీ శాఖ ఉద్యోగుల సాయంతో లోక్ బిరదారీ ప్రకల్ప్ కార్యకర్తలు కొన్ని పదాలు నేర్చుకున్నారు. అవి వారితో మాటలు కలపడానికైతే సరిపోయాయి గానీ వారి మనసులు గెలవడం మాత్రం కుదరలేదు.
 
కొద్ది రోజుల తర్వాత జరిగిన ఒక సంఘటన గిరిజనులకు వీరిపై నమ్మకం కుదిరేలా చేసింది. ఒక గిరిజన యువకుడు అగ్నిప్రమాదంలో ఒళ్ళు కాల్చుకున్నాడు. దాదాపు ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. ఆ సంగతి తెలిసి ప్రకాష్ తనే స్వంతంగా వారి దగ్గరకు వెళ్ళి వైద్యం చేశాడు. కొద్ది రోజులకు అతను కోలుకుని మళ్ళీ మామూలు మనిషిగా తిరగసాగాడు. మెల్లగా మిగతావారు కూడా ఆస్పత్రికి వెళ్ళసాగారు.
 
ప్రకాష్ ఆమ్టే, మందాకినీ ఆమ్టేలు [[ముంబాయి]]లో వైద్యవిద్యను అభ్యసించి, [[1972]]లో వివాహమాడారు. మడియా గోండులు అమాయకులు, నిరక్షరాస్యులు. వారిని ఫారెస్ట్ గార్డులు, గిరిజనేతరుల నుండి రక్షించాలంటే, వారికి విద్య ఎంతో అవసరం అని ప్రకాష్ ఆమ్టే, అతని సహచరులు గుర్తించారు. అలా ఒక బడిని ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు దాంట్లో సుమారు 600 మంది విద్యార్థులు చదువుకొంటున్నారు. ఈ స్కూల్లో చదివిన ఇద్దరు మడియా గోండు విద్యార్థులు ఇప్పుడు వైద్యులయ్యారు.
 
==గుర్తింపులు==
"https://te.wikipedia.org/wiki/ప్రకాష్_ఆమ్టే" నుండి వెలికితీశారు