నార్మన్ బోర్లాగ్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
మూలం చేర్పు |
|||
పంక్తి 3:
ఏడేళ్ళ నుంచి పదిహేడేళ్ళ వరకూ పొలాల్లోపని, చేపలు పట్టడం, వేటాడ్డం, కోళ్ళు పశువులతో కాలక్షేపం, ఆటపాటలతో గడిపాడు.
==విద్య==
ఒక పక్క చదువుకుంటూ మిన్నిసోటా విశ్వవిద్యాలయం నుంచి అటవీశాస్త్రంలో పట్టాపొంది ఉద్యోగంలో చేరాడు. తిరిగి అదే విశ్వవిద్యాలయం నుంచి ప్లాంట్ పాథాలజీ, జన్యు శాస్త్రంలో పీహెచ్డీ చేశాడు.
పరిశోధనల్లో ఆయన దృష్టి [[గోధుమ]] పంట మీద పడడం ప్రపంచానికి గొప్ప మేలు చేసింది. చీడపీడలను తట్టుకుంటూ అధిక దిగుబడినిచ్చే పొట్టిరకం గోధుమ వంగడాలను కనిపెట్టడం ద్వారా సంచలనం సృష్టించారు. 1960 ప్రాంతంలో కరువుకాటకాలతో అల్లాడుతున్న [[ఇండియా]], [[పాకిస్థాన్]] దేశాల్లో ఆ వంగడాలను పరిచయం చేశారు. 1963లో ఆయన ఇండియా కూడా సందర్శించాడు. ఆయన వంగడాల వల్ల గోధుమల దిగుబడి రెట్టింపైంది. అది [[హరిత విప్లవం]]గా మారింది. [[ఆసియా]], [[ఆఫ్రికా]] ప్రాంతాల్లో సైతం కోట్లాది మంది రైతులు లబ్ది పొందారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద 18.7 కోట్ల ఎకరాల్లో బోర్లాగ్ కనిపెట్టిన గోధుమ వంగడాలను వాడుతున్నారు.
ఆహార పంటల కొరతను తీర్చినందుకు 1970లో బోర్లాగ్కు [[నోబెల్ శాంతి బహుమతి]]ని ప్రకటించారు. ఆ విషయాన్ని టెలిఫోన్లో చెప్పడానికి అందుబాటులో లేక వార్తాహరులు వెతుక్కుంటూ వెళితే గోధుమ పొలంలోఆయన కనిపించారు. బోర్లాగ్ 2009 సెప్టెంబర్ 12న తన 95వ ఏట మరణించాడు. ఇప్పటికీ భారత దేశంలోని [[పంజాబ్]], [[హర్యానా]] ప్రాంతాల్లో రైతుల ఇళ్లలో ఆయన ఫొటో కనిపిస్తుంది. <ref>ఈనాడు గురువారం, 25 మార్చి 2010 హాయ్ బుజ్జీ శీర్షిక</ref>
==మూలాలు==
{{మూలాలజాబితా}}
|