గురజాడ కృష్ణదాసు వెంకటేష్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: en:G. K. Venkatesh
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''జి.కె.వెంకటేష్''' లేదా '''గురజాడ కృష్ణదాసు వెంకటేష్''' ([[సెప్టెంబర్ 21]], [[1927]] - నవంబర్ [[1993]]) ప్రఖ్యాత దక్షిణ భారత సినిమా సంగీత దర్శకుడు. ఈయన తెలుగు, తమిళ సినిమాలకు సంగీతము సమకూర్చినప్పటికీ కన్నడ చిత్రరంగములో 1960ల నుండి 1980ల వరకు అనేక కన్నడ సినిమాలకు సంగీతం సమకూర్చాడు. ఒక సాంఘిక సినిమా కన్నడ నాట ఒకే థియేటర్లో ఒకే రోజు మూడు ఆటల చొప్పున సంవత్సరానికి మూడు మాసాలపాటు ఏకధాటిగా నడిచింది. ఆ సినిమా పేరు ''బంగారద మనష్య'', ఈ సినిమాకు సంగీతదర్శకుడు జి.కె.వెంకటేషే. ఈ సినిమా ను తెలుగులొ [[బంగారు మనిషి]]గా తిరిగి తీశారు.

==తొలి జీవితం==
జి.కె.వెంకటేష్ జన్మస్థలంస్వస్థలం [[హైదరాబాదు]], ఆయన పెరిగింది [[మద్రాసు]]లో. ఆయన జీవితంలో ఒక వింత ఏమిటంతే ఆయన ఎన్నడు స్కూలుకి వెళ్ళి చదువుకోలేదు. ఆయన తండ్రి సంగీత విద్వాంస్డు, ఆయన నుంచి వెంకటేష్‌కి సంగీతం వారసత్వంగా లభించింది. తొలినాళ్ళలో తమిళ చిత్రరంగంలో [[ఎమ్మెస్ఎమ్.ఎస్. విశ్వనాధన్]] తో కలసి పనిచేశారు. [[సంతోషం]] అనే చిత్రం (ఎన్టీ రామారావు కథానాయకుడు) లో విశ్వనాథన్ రామ్మూర్తి సంగీత దర్శకత్వంలో నేపథ్యగానం కూడా చేశారు. కన్నడ చిత్రరంగంలో స్టార్ సంగీత దర్శకునిగా వెలుగొందారు. తెలుగులో తొలిసారిగా [[నాటకాల రాయుడు]] (భగవాన్ హిందీ చిత్రం అల్బెలా చిత్రం ఆధారంగా నాగభూషణం హీరోగా నిర్మితమైంది) ద్వారా పరిచయమయ్యారు. తర్వాత [[జమీందారు గారి అమ్మాయి]] చిత్రానికి సంగీతమిచ్చారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి, [[పి.సుశీల]]కు మంచిపేరు తెచ్చిన ''మ్రోగింది వీణ'' పాట ఈ చిత్రంలోనిదే. తరువాత [[అమెరికా అమ్మాయి]] (ఒక వేణువు వినిపించెను, [[జి.ఆనంద్]] పాటలలో అత్యుత్తమమైనది), చక్రధారి (మానవా ఏమున్నది ఈ దేహం, ఎక్కడున్నావు, నువ్వెవరయ్యా నేనెవరయ్యా (రామకృష్ణ), విఠలా విఠలా (రికార్డులలో ఆనంద్, చిత్రంలో బాలు), [[తరం మారింది]] మొదలైన చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు.
 
జి.కె.వెంకటేష్ కన్నడ చిత్ర సీమలో బి.కె.సుమిత్ర, బెంగుళూరు లత, సి.అశ్వద్థ, సులోచన వంటి అనేక ప్రతిభ గల నూతన గాయకులను పరిచయం చేశాడు. [[రాజ్ కుమార్]] ను గాయకుడుగా పరిచయం చేసింది కూడా వెంకటేషే. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ సంగీతదర్శకులు [[ఇళయరాజా]], [[ఎల్.వైద్యనాథన్]], శంకర్ గణేష్ వంటివారు జి.కె.వెంకటేష్ శిష్యులే. కన్నడ చిత్రరంగంలో 600కు పైగా సినిమాలకు సంగీతం అందించిన వెంకటేష్, ''భక్త తుంబుర'' మరియు ''హూస నీరు'' చిత్రాలకు కర్ణాటక రాష్ట్ర పురస్కారాలను అందుకున్నాడు.