మేకా రంగయ్య అప్పారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
వీరు [[నూజివీడు శాసనసభ నియోజకవర్గం]] నుండి వరుసగా 1952, 1957, 1962, 1967 మరియు 1972లలో జరిగిన ఎన్నికలలో [[కాంగ్రెసు]] పార్టీ అభ్యర్ధిగా గెలుపొందారు. నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గాలలో కొంతకాలం సాంస్కృతిక, అబ్కారీ శాఖామాత్యులుగా సేవలందించారు. ఆ తరువాత రాజ్యసభకు ఎన్నికయ్యాడు. అప్పారావు, బెజవాడ గోపాలరెడ్డి, పి.వి.జి.రాజుల సమకాలీకుడు. తొలిసారిగా 1952లో సి.పి.ఐ అభ్యర్ధి దాసరి నాగభూషణరావును ఓడించి, శాసనసభకు ఎన్నికైన అప్పారావు, 1989లో ఒక్క సారి తెలుగుదేశం అభ్యర్ధిగా పోటీచేసి, కాంగ్రేస్ అభ్యర్ధి పాలడుగు వెంకట్రావు చేతిలో ఓడిపోయిన తరుణం తప్ప మరెన్నడూ ఎన్నికలలో ఓటమి చవిచూడలేదు.
 
అప్పారావు టెన్నిసు ఆటగాడు. ఈయన తన తండ్రిగారు తెలుగులోకి అనువదించిన గీతా గోవిందాన్ని ఆంగ్లంలోకి మార్చారు. [[ఉమర్ ఖయ్యాం]] రుబాయిత్ లను గేయ రూపంలో రాశారు. చంద్రగుప్త, యాంటిగని నాటకాలు రాశారు. అప్పారావు కొంతకాలం1974 నుండి 1980 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపసంచాలకునిగా పనిచేశాడు.<ref>http://www.andhrauniversity.info/sucvclist.html</ref> నూజివీడులో ధర్మ అప్పారావు కళాశాలను ప్రారంభించాడు.<ref>[http://www.hinduonnet.com/thehindu/2003/02/01/stories/2003020103740400.htm Ex-Minister Apparao dead ] - The Hindu</ref>
 
ఎన్నో సాహిత్య, సాంస్కృతిక సంస్థలకు సాయమందించిన వీరు [[జనవరి 31]], [[2003]]న పరమపదించారు.