శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చిదిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 1:
'''శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం''' కలియుగ వైకుంఠపతి
పంక్తి 7:
{{main|సుప్రభాత సేవ}}
[[తిరుమల]] శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం లో ప్రతిదినం 'సుప్రభాతం' అనబడే 'మేలుకొలుపు' సేవతో ఆ రోజు పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. తిరుమలలో ప్రతిరోజు నేటికి ప్రప్రధమంగా శ్రీ వారి దర్శన భాగ్యాన్ని పొందుతున్న వ్యక్తి 'సన్నిధి గొల్ల'. ప్రతిదినం తెల్లవారు జామున సన్నిధి గొల్ల శుచిస్నాతుడై తిరునామాన్ని ధరించి గోవింద నామాన్ని పఠిస్తూ దివిటీ(కాగడ) పట్టుకొని తిరుమల ఉత్తర మాడవీధి లోని శ్రీవైఖానస అర్చకుల తిరుమాళిగ (ఇంటికి) వెళ్ళి భక్తిపూర్వకంగా వారికి నమస్కరించి ఆలయానికి ఆహ్వానిస్తాడు. అర్చకులు ఆలయంలోనికి ప్రవేశించి [[బంగారు వాకిలి]] వద్ద వేచి వుంటారు. ఈ లోగా పెద్ద జీయంగార్, చిన్న జీయంగార్ స్వాములు, ఏకాంగి స్వామి, ఆలయ అధికారులు తలుపులు తెరువడానికి సిద్ధంగా వుంటారు. సమయం 3 గంటలు కాగానే, అర్చకులు 'కుంచకోల' అనబడే తాళాలతో '
==సుప్రభాతకర్త అణ్ణన్ స్వామి==
{{main|అణ్ణన్ స్వామి}}
==సుప్రభాతంలో విభాగాలు==
పంక్తి 57:
; సుప్రభాత శ్లోకాల సారాంశం
కౌసల్యా కుమారా! పురుషోత్తమా! రామా! తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన కర్తవ్యములు ఆచరింపవలసి ఉన్నది. ఓ గోవిందా! గరుడ ధ్వజా!
[[సప్తర్షులు]] నీ పాదములను పూజించుటకు సిద్ధముగానున్నారు. ఓ వేంకటాచలపతీ! శివుడు, బ్రహ్మ, కుమారస్వామి, ఇంద్రుడు మున్నగు దేవతలు త్రివిక్రమావతారము మున్నగు నీ చరిత్రలను కొనియాడుచున్నారు. బృహస్పతి నేటి తిథివారాదుల ఫలములను చదువుచున్నాడు. లేత చిగురులు, పూల సువాసనలతో మలయమారుతము వీచుచున్నది. పెంపుడు చిలుకలు విలాసముగా పాడుచున్నవి. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతము.
నారదుడు నీ దివ్య చరిత్రమును గానము చేయుచున్నాడు. ఓ శేషశైలాధీశా! నీకు సుప్రభాతమగు గాక. తుమ్మెదల గుంపు ఝంకార గీత ధ్వనులతో నిన్ను సేవించబూనుచున్నవి. గొల్లపడుచులు పెరుగు చిలుకుచున్న సవ్వడులు నలుదిక్కుల నిండినవి. శ్రీమాన్! నీవు కోరిన వరములనిచ్చువాడవు. లోకబంధువుడవు. శ్రీనివాసా! దయాసముద్రుడవు. లక్ష్మీదేవిని వక్షస్థలమున ధరించినవాడవు. దివ్యస్వరూపుడవు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.
బ్రహ్మాది దేవతలు పుష్కరిణిలో స్నానముచేసి ద్వారము కడ కాచుకొనియున్నారు. నీ నివాసమగు ఈ పర్వతమును అందరును శేషశైలము, గరుడాచలము, వేంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి మున్నగు పేర్లతో నిత్యము పిలుచుచుందురు. అష్టదిక్పాలకులు నీ సేవకై కాచుకొనియున్నారు. [[గరుడుడు]], మృగరాజు, ఆదిశేషుడు, గజేంద్రుడు, అశ్వరాజును తమ తమ శక్తిని చూపుటకు నీ యనుమతిని వేడుచున్నారు. ఓ వేంకటేశ్వరా!
స్వామీ! నీ పాదధూళిచే పవిత్రమైనవారు వేరే స్వర్గమోక్షములను మనస్సులో కూడ కోరరు. స్వర్గ, మోక్షములకు పోవుచున్నవారు మార్గములో నీ గుడి గోపురముల శిఖరములను చూచి ఆనందపరవశులై మనుష్యులుగా భూలోకమునందే మిమ్ము దర్శించుచు ఉండవలెనని కోరుచుందురు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.
|