ఎ.ఆర్.కృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
 
శ్రీకాకుళం, బెజవాడ, చల్లపల్లి, మచిలీపట్నం హైదరాబాదులలో విద్యాభ్యాసం చేశాడు. యల్.యం.ఇ చదువుతున్నపుడే హైదరాబాదు విమోచనోద్యములో పాల్గొన్నాడు. అజ్ఞాతవాసమునుడి వెలుపలికి వచ్చి సోషలిస్ట్ పార్టీ కార్యకలాపాలలో పాల్గొన్నాడు. 1948నాటికి రాజకీయ రంగము మీద వ్యామోహము విడనాడి నాటక రంగము ప్రవేశించాడు. 1952నాటికి పూర్తిగా నాటక రంగమునకు అంకితమై వినూత్నమైన ప్రయోగాలు చేయాలన్న తపన బయలుదేరింది. జీవిక నిమిత్తం రాష్ట్ర విద్యుత్ బోర్డు లో సూపర్వైజర్ గా పనిచేసేవాడు. యునెస్కో ఆంతర్జాతీయ నాటక సంస్థకు అనుబంధసంస్థ గా కమలాదేవి చటోపాధ్యాయ భారతీయ నాట్య సంఘాన్ని స్థాపించాడు. ఆమె ప్రోద్బలముతో కృష్ణ 1952లో "ఇండియన్ నేషనల్ థియేటర్" నెలకొల్పాడు. 1953లో "దేశం కోసం" నాటక ప్రదర్శన వెల్లువ సృష్టించాడు. 1955లో ఢిలీలో జరిగిన భారతీయ నాట్యసంఘ సమావేశములో ఉపన్యాసమిచ్చి ఆ సంఘపు సంయుక్త కార్యదర్శి గా ఎన్నుకోబడ్డాడు. ఆంధ్ర విశ్వకళా పరిషత్, నాటక కళల విభాగానికి సభ్యునిగా పనిచేశాడు<ref>http://www.andhrauniversity.info/arts/theatrearts/index.html</ref>.
 
 
పంక్తి 11:
 
 
1974లో కృష్ణ పట్టుదలతో [[ఉన్నవ లక్ష్మీనారాయణ]] రచించిన మాలపల్లిని, వందమంది కళాకారులు, సహజమైన సెట్టింగులతో నాటకంగా రూపుదిద్ది, ఒకే వేదికపై వరుసగా ముప్పదిసార్లు, భారతదేశమంతటా వందకు పైగా ప్రదర్శనలిచ్చారు. తెలుగువారి జానపద కళా స్వరూపమైన తోలుబొమ్మలాటను పునరుద్ధరించి ఆ కళా ఔన్నత్యాన్ని విదేశాలలో చాటాడు. నాట్యకళపట్ల ప్రేక్షకులలో అభిమానం పెంచడానికి, వారి ఆదరణ, పోషణ కల్పించడానికి "నాట్యమిత్ర పధకం" ప్రవేశపెట్టి నాటకాభిమానులను సభ్యులుగా చేర్పించాడు. వృత్తికళాకారుల సంక్షేమానికి 1971లో రంగస్థల కళాకారుల సంఘం స్థాపించాడు.ఔత్సాహిక కళాకారుల శ్రేయస్సుకై వారి సంఘమూ ఏర్పాటుచేయించాడు. యక్షగానానికి రంగస్థలముపై ప్రాణప్రతిష్ఠ చేసాడు<ref>గుంటూరు జిల్లా ఆణిముత్యాలు, గుత్తికొండ జవహర్ లాల్, కమల పబ్లికేషన్స్, హైదరాబాదు, 2009, పుట.147</ref>.
 
తన ఆశయాల సాధనలో ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొన్న కృష్ణను భారత ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది.
"https://te.wikipedia.org/wiki/ఎ.ఆర్.కృష్ణ" నుండి వెలికితీశారు