కాట్రగడ్డ బాలకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
ప్రాధమిక విద్యాభ్యాసము ఇంటూరులో జరిగింది. తరువాత బాపట్ల బోర్డు పాఠశాలలో ఉన్నత విద్య పూర్తి చేశాడు. మద్రాసు వెళ్ళి 1921లో వెస్లీ కళాశాలలో చదువు పూర్తి చేశాడు. విద్యార్ధి సంఘముల కార్యకలాపాలలో విశేష శ్రద్ధ చూపించాడు. 1939 సెప్టెంబర్ లో చిదంబరం లో జరిగిన విద్యార్ధి సమావేశములో పతాక ఆవిష్కరణ చేశాడు. 1941 జనవరిలో తమిళనాట పాల్ఘాట్, కొయంబత్తూరు లలో జరిగిన విద్యార్ధి సమావేశాలలో పాల్గొని దేశ స్వాతంత్ర్య సమరానికి సమాయత్తము కావల్సిందిగా ప్రబోధించాడు. బాలకృష్ణ కార్యకలాపాలు నచ్చని బ్రిటిష్ ప్రభుత్వం మార్చ్ 3, 1941న అరెస్ట్ చేసి వెల్లూర్ కారాగారంలో నిర్బంధించింది.
 
1941 జూన్ 21న హిట్లర్ సోవియట్ యూనియన్ పై దాడిచేసిన తరువాత యుద్ధరీతిలో వచ్చిన మార్పులను విశ్లేషిస్తూ 300 పుటల బృహత్ గ్రంథాన్ని పది రోజులలో రచించాడు. 1942 జూన్ 24న జైలు నుండి విదుదలైన తరువాత బెల్గాం విశ్వవిద్యాలయం లో రాజకీయ శాస్త్రం బోధించాడు. తరువాత బొంబాయిలోని అఖిల భారత పరిశ్రమల సంస్థలోనూ, లక్నో విశ్వవిద్యాలయం, టాటా సాంఘిక సంస్థలలోనూ పనిచేసి అచట ఇమడలేక మానివేశాడు. ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఫెలోషిప్ తో రెండు సంవత్సరాలు అమెరికా లో పనిచేశాడు. తిరిగి వచ్చిన తరువాత గ్రంధ రచన చేబట్టి The Second World War and Industrialization in India, Political Thought in Dravidian Literature, Class and Class Struggle, Economic Planning in India మున్నగు పుస్తకాలు రచించాడు.
 
ఆరోగ్యము క్షీణించి 42వ ఏట 1948 దిసెంబర్ 18న పొన్నూరులో మరణించాడు.
"https://te.wikipedia.org/wiki/కాట్రగడ్డ_బాలకృష్ణ" నుండి వెలికితీశారు