వేంకటేశ్వరుడు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ru:Венкатешвара
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
==కలియుగ రక్షార్థం క్రతువు==
ఒక్కప్పుడు కశ్యాపాది మహర్షులు గంగానది ఒడ్డున కలియుగ రక్షార్థం క్రతువు చేయ నిర్ణయించి యజ్ఞం ఆరంభించే సమయానికి [[నారదుడు]] అక్కడకు అరుదెంచి, అక్కడ ఉన్న కాశ్యప, ఆత్రేయ,[[మార్కండేయుడు|మార్కండేయ]], గౌతామాది మహర్షులను చూసి, ఆ మహర్షులను క్రతువు దేనికొరకు చేస్తున్నారు యాగఫలాన్ని స్వీకరించి కలియుగాన్ని సంరక్షించే వారు ఎవరు అని ప్రశ్నిస్తే, నారదుని సలహామేరకు అందరు [[భృగు మహర్షి]] వద్దకు వెడతారు. అప్పుడు ఆ మహర్షులందరు భృగు మహర్షిని ప్రార్థించి [[కలియుగం]] లో త్రిమూర్తులలో ఎవరు దర్శన, ప్రార్థన, అర్చనలతో ప్రీతి చెంది భక్తుల కష్టాలను నిర్మూలించి సర్వకోరికలు తీరుస్తారో పరీక్షచేసి చెప్పమని కోరుతారు.
 
==సత్యలోకం==
మహర్షుల కోరికమేరకు భృగువు యోగదండం, కమండలం చేత బట్టి, జపమాల వడిగా త్రిప్పుతూ సత్యలోకం ప్రవేశించగా, బ్రహ్మ సరస్వతీ సమేతుడై సరస్వతి సంగీతాన్ని ఆలకిస్తూ, [[చతుర్వేదాలు|చతుర్వేదఘోష]] జరుగుతూ ఉంటే దానిని కూడా ఆలకిస్తూ, సృష్టి జరుపుతూ ఉంటాడు. చతుర్ముఖ [[బ్రహ్మ]] భృగు మహర్షి రాకను గ్రహించడు. తన రాక గ్రహించని బ్రహ్మకు కలియుగం లో భూలోకం లో పూజలుండవు అని శపిస్తాడు.
 
==శివ లోకం==
బ్రహ్మ నుంచి వెళతాడు భృగువు. శివ లోకంలో పార్వతి శివులు ఆనంద తాండవం చేస్తూ పరవశిస్తుంటారు. పార్వతి శివులు భృగు మహర్షి రాకను గ్రహించరు, తన రాక గ్రహించని శివునకు కలియుగం లో భూలోకం లో విభూతితో మాత్రమే పూజలు జరుగుతాయని శపిస్తాడు.
 
== నారాయణ లోకం==
శివ లోకం నుంచి నారాయణ లోకం వెళతాడు భృగువు. ఇక్కడ నారాయణుడు ఆదిశెషుని మీద శయనిస్తుంటాడు. ఎన్నిసార్లు పిలిచిన పలకలెదని భృగువు, లక్ష్మీ నివాసము అయిన నారాయణుని వామ వక్షస్ధలమును తన కాలితొ తంతాడు.
[[బొమ్మ:Lordvenkat.jpg|left|thumb|శ్రీ వేంకటేశ్వరుడు ]]
అప్పుడు శ్రీమహావిష్ణువు తన తల్పం నుండి క్రిందకు దిగి " ఓ మహర్షీ!మీ రాకను గమనించలేదు.క్షమించండి.నా కఠినమైన వక్షస్థలమును తన్ని మీ పాదాలు ఎంత కందిపోయుంటాయో" అని భృగుమహర్షిని ఆసనం పైన కూర్చుండబెట్టి అతని పాదాలను తన ఒడిలో పెట్టుకుని పిసకడం మొదలుపెట్టాడు. అలా పిసుకుతూ మహర్షి అహంకారానికి మూలమైన పాదం క్రింది భాగంలోని కన్నును చిదిమేశాడు.మహర్షి తన తప్పును తెలుసుకొని క్షమాపణ కోరుకొని వెళ్ళిపోయాడు. విష్ణువునే సత్వగుణ సంపూర్ణుడిగా గ్రహించాడు.
కాని తన నివాసస్థలమైన వక్షస్థలమును తన్నిన కారణంగా లక్ష్మీదేవి అలకపూని భూలోకానికి వెళ్ళిపోయింది. శ్రీమహాలక్ష్మి లేని వైకుంఠంలో ఉండలేని మహావిష్ణువుకూడా లక్ష్మీదేవిని వెదుకుతూ భూలోకానికి పయనం అయ్యాడు.
 
==ఇవి కూడా చూడండి==
*[[S:శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం|శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం]]
* [http://labs.google.co.in/smschannels/subscribe/tirumalaTirupatiDevastanam తితిదెతితిదే ప్రతి రొజురోజు ఉఛితఉచిత మొబైల్ సమాఛారముసమాచారము కొరకు]
 
{{తిరుమల తిరుపతి}}
"https://te.wikipedia.org/wiki/వేంకటేశ్వరుడు" నుండి వెలికితీశారు