లాల్ కృష్ణ అద్వానీ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి యంత్రము కలుపుతున్నది: sd:لال ڪرشنا آڏواڻي; cosmetic changes
పంక్తి 16:
| predecessor =
| successor =
| party =[[బొమ్మదస్త్రం:BJP-flag.svg|30px]] [[భారతీయ జనతా పార్టీ]]
| religion =
| spouse =
పంక్తి 28:
[[భారత్|భారతదేశపు]] ప్రముఖ రాజకీయ నాయకులలో ఒకడైన లాల్ కృష్ణ అద్వానీ [[1927]] [[నవంబర్ 8]]న [[సింధ్]] ప్రాంతంలోని [[కరాచి]]లో జన్మించాడు. 15 సం.ల వయస్సులోనే ఆర్.ఎస్.ఎస్.లో ప్రవేశించాడు. ఆ తరువాత దేశ రాజకీయాలకే అంకితమయ్యాడు. భారతీయ జనసంఘ్ పార్టీలో చేరి అనతి కాలంలొనే ముఖ్య పదవులు పొందినాడు. [[1967]]లో [[ఢిల్లీ]] మున్సిపల్ కార్పోరేషన్ అధ్యక్షుడైనాడు. [[1977]]లో [[మురార్జీ దేశాయ్]] ప్రభుత్వంలో మంత్రిపదవికి పొందినాడు. [[1980]]లో [[భాజపా]] ఏర్పడిన తరువాత దేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహించే అవకాశం లభించింది. [[అటల్ బిహారి వాజపేయి]] నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో కీలకమైన హోంశాఖ పదవిని నిర్వహించాడు. [[2009]] ఎన్నికలకు ముందే భాజపా ప్రధాని అభ్యర్థిగా ప్రకటింబడ్డాడు. ప్రస్తుతం 15వ లోక్‌సభ ఎన్నికలకై [[గుజరాత్]] లోని గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నాడు. <ref>http://www.lkadvani.in/eng/content/view/551/328/</ref>
 
== ప్రారంభ జీవనం ==
[[1927]] [[నవంబర్ 8]]న [[సింధ్]] ప్రాంతంలోని [[కరాచి]]లో జన్మించిన అద్వానీ [[కరాచీ]], [[హైదరాబాదు (పాకిస్తాన్)|హైద్రాబాదు]]లలో విద్య నభ్యసించి 15 సం.ల ప్రాయంలోనే [[రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్]] (ఆర్.ఎస్.ఎస్)లో ప్రవేశించి ఆర్.ఎస్.ఎస్ సిద్ధాంతాలను పూర్తిగా ఒంటపట్టించుకొని ఇంజనీరింగ్ చదువును కూడ మానివేసి పూర్తిగా దేశ రాజకీయాలకే అంకితమయ్యాడు. దేశ విభజన అనంతరం భారత్ కు తరలివచ్చినాడు. [[మహాత్మా గాంధీ]] హత్య అనంతరం అనేక మంది ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలతో పాటు అద్వానీ కూడ అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత [[శ్యాం ప్రసాద్ ముఖర్జీ]] స్థాపించిన [[భారతీయ జనసంఘ్]] పార్టీలో చేరి చురుగ్గా పనిచేశాడు. [[దీన్ దయాళ్ ఉపాధ్యాయ]] సహకారంతో మంచి కార్యకర్తగా పేరుపొంది, [[రాజస్థాన్]] [[జనసంఘ్]] పార్టీ అద్యక్షుడికి సలహాదారునిగా నియమించబడ్డాడు.
== 1960, 70 దశాబ్దం ==
1966లో [[ఢిల్లీ]] మెట్రోపాలిటన్ కౌన్సిల్ మధ్యంతర ఎన్నికలలో జన సంఘ్ తరపున ఎన్నికై మరుసటి సంవత్సరమే [[ఢిల్లీ]]మున్సిపల్ [[కార్పోరేషన్]] అద్యక్షుడయ్యాడు. 1970లో [[రాజ్యసభ]]కు ఎన్నికైన అద్వానీ జనసంఘ్ లో ప్రముఖ పాత్ర వహించి దేశ ప్రజలను ఆకర్షించాడు. 1975లో [[మీసా చట్టం]] కింద అరెస్ట్ అయ్యాడు. [[ఎమర్జెన్సీ]] కాలంలో తన అనుభవాలను వివరిస్తూ అద్వానీ [[ది ప్రిజనర్స్ స్క్రాప్ బుక్]] గ్రంథాన్ని రచించారు. 1976లో జైలు నుంచే రాజ్యసభకు ఎన్నికైనాడు. ఎమర్జెన్సీ అనంతరం జనసంఘ్ పార్టీ [[జనతా పార్టీ]]లో విలీనం కావడంతో అద్వానీ 1977లో జనతా పార్టీ తరపున పోటీ చేసి [[మొరార్జీ దేశాయ్]] ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖా మంత్రిగా పనిచేశారు. ఆ విధంగా కేంద్ర సమాచార, ప్రసార శాఖా మంత్రిగా పని చేసిన మొట్టమొదటి కాంగ్రెసేతర వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. జనతా పార్టీ పతనంతో జనసంఘ్ పార్టీ వేరుపడి [[భారతీయ జనతా పార్టీ]] పేరుతో కొత్త పార్టీ స్థాపించడంతో అద్వానీకి దేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహించే అవకాశం కల్గింది.
== 1980 దశాబ్దం ==
కాని ప్రారంభంలో పార్టీ పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. 1982లో పార్టీకి లభించిన [[లోక్‌సభ]] స్థానాల సంఖ్య రెండు మాత్రమే. 1986లో అద్వానీ [[భారతీయ జనతా పార్టీ]] అద్యక్ష పదవిని చేపట్టిన తర్వాత పార్టీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 1989 లోక్‌సభ ఎన్నికలలో పార్టీ స్థానాల సంక్యను 86 కు పెంచగలిగినాడు. అద్వానీ లోక్‌సభలోకి తొలి సారిగా ప్రవేశించినది కూడా 1989లోనే.
== అయోధ్య రథయాత్ర ==
అద్వానీ జీవితంలోనే కాదు దేశ రాజకీయాలనే మలుపు తిప్పిన సంఘటన [[అయోధ్య రథయాత్ర]]. [[సోమనాథ దేవాలయం]] నుంచి [[అయోధ్య]]కు రథయాత్ర చేసి అయోధ్యలో రామాలయాన్ని నిర్మించడానికి ప్రజల మద్దతు పొందడమే ఆశయంగా పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ జన్మదినమైన [[1990]], [[సెప్టెంబర్ 25]]న <ref>http://www.lkadvani.in/eng/content/view/449/295/</ref> ప్రారంభించిన అయోధ్య రథయాత్ర [[బీహార్]] సరిహద్దులో [[లాలూ ప్రసాద్ యాదవ్]] యాత్రకు పగ్గాలు వేయడంతో ఆగిపోయింది. 10,000 కిలోమీటర్ల రథయాత్ర చేసి [[అక్టోబర్ 30]]న అయోధ్య చేరుకోవాలని ప్రణాళిక వేసుకున్న రథయాత్ర ఆగిపోయిననూ అప్పటికే అద్వానీ విశేష ప్రజాదరణను పొందినాడు. ఆ తర్వాత [[విశ్వనాథ్ ప్రతాప్ సింగ్]] ప్రభుత్వానికి [[భారతీయ జనతా పార్టీ]] మద్దతు ఉపసంహరించడం, ఆ తర్వాత 1991 లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ స్థానాల సంఖ్యను 120కు పెంచిన ఘనత అద్వానీదే. 1992 డిసెంబర్ 6న అయోధ్యలో జరిగిన [[కరసేవ]] సంఘటనలో అద్వానీ అరెస్ట్ అయ్యాడు.
 
ఆ తర్వాత పరిణామాలు భారతీయ జనతా పార్టీని కానీ అద్వానీని కానీ అంతగా ప్రభావితం చేయలేదు. 2004 ఎన్నికలలో పరాజయం తర్వాత పార్టీ సీనియర్ నాయకులే అద్వానీపై విమర్శలు గుప్పించారు. [[ఉమా భారతి]], [[మదన్ లాల్ ఖురానా]] లాంటి సీనియర్ నాయకులు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. [[పాకిస్తాన్]] పర్యటన సందర్భంగా [[జిన్నా]] సమాధి వద్ద విజిటర్స్ బుక్ లో అద్వానీ రాసిన వ్యాఖ్యలు దేశంలో కలకలం రేపాయి.
 
== '''పార్టీ అధ్యక్ష పదవిలో అద్వానీ''' ==
అద్వానీ మొట్టమొదటి సారిగా [[1986]] లో [[అటల్ బిహారీ వాజపేయి]] నుంచి పార్టీ పగ్గాలు స్వీకరించి [[1991]] వరకు, రెండో పర్యాయము [[1993]] నుంచి [[1998]] వరకు పార్టీ అధిపతిగా పనిచేశారు. చివరగా మోడో పర్యాయము [[2004]] నుంచి [[2005]] వరకు పార్టీని నడిపించి ఆ తర్వాత ప్రస్తుత పార్టీ అద్యక్షుడు [[రాజ్ నాథ్ సింగ్]] కు తన స్థానాన్ని అప్పగించాడు. తన అధ్యక్ష పదవీ కాలంలో పార్టీకి ఉచ్ఛస్థితిలోకి తీసుకొని వచ్చి [[భారతీయ జనతా పార్టీ]] [[ఉక్కుమనిషి]] గా పేరుగాంచినాడు.
 
== '''పార్లెమెంటు సబ్యుడిగా''' ==
[[1970]] లో తొలిసారిగా [[రాజ్యసభ]] ద్వారా [[లోక్‌సభ]] లోకి ప్రవేశొంచారు. [[1989]] వరకు రాజ్యసభ సబ్యుడిగా ఉన్నా[[రు. 1980]] ప్రాంతంలో [[రాజ్యసభ]] లో ప్రతిపక్ష నాయకుడిగా తనపాత్రను పోషించారు. [[1989]] లో తొలిసారిగా [[లోక్‌సభ]] లోకి ప్రవేశించారు. [[లోక్‌సభ]] లోనూ ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికైనారు
 
== '''కేంద్ర మంత్రిగా అద్వానీ''' ==
[[1977]] లో [[మురార్జీ దేశాయ్]] [[జనతా]] ప్రభుత్వంలో తొలిసారిగా కేంద్ర మంత్రిగా అవకాశం లభించింది. ఆ తర్వాత [[అటల్ బిహారీ వాజపేయి]] ప్రభుత్వంలో 3 పర్యాయాలు కూడ కేంద్ర మంత్రిగా హోంశాఖను సమర్థవంతంగా నిర్వహించారు. 1998-2004 మద్య ఉప ప్రధాని పదవి బాధ్యతలు కూడ చేపట్టారు.
== నాదేశం నా జీవితం ==
[[2008]]లో "మై కంట్రీ, మై లైఫ్" పేరుతో స్వీయచరిత్రను విడుదల కావించాడు. 986 పేజీల పుస్తకంలో తన రాజకీత జీవితపు అంతరంగాన్ని విపులంగా వివరించాడు.<ref> ఈనాడు దినపత్రిక . తేది మార్చి 26, 2008 </ref>
== ప్రధాని అభ్యర్థిగా అద్వానీ ==
[[2007]], [[డిసెంబర్ 10]] నాడు పార్టీ కేంద్ర కార్యవర్గం సమావేశమై [[అటల్ బిహారీ వాజపేయి]] వారసుడిగా అద్వానీ పేరును ఖరారు చేసింది. అనారోగ్య కారణాలపై నాయకత్వ భాద్యతల నుంచి వైదొల్గాలని నిర్ణయించుకున్నందున, [[లోక్‌సభ]] కు మధ్యంతర ఎన్నికలు రావచ్చన్న దృష్టితో అద్వానీ లాంటి వ్యక్తికి ఈ బాధ్యతలు కట్టబెట్టాలని వాజపేయి భాజపా పార్లమెంటరీ బోర్డుకు సందేశం పంపారు. అద్వానీ అభ్యర్థిత్వాన్ని బోర్డు కూడా ఆమోదించింది. [[పాకిస్తాన్]] పర్యటనలో జిన్నాకు లౌకికవాదిగా పేర్కొని సంఘ్ పరివార్ చే ఆగ్రహానికి గురైన అద్వానీ ఆ తర్వాత అద్యక్ష పదవికి కూడా వదులుకోవాల్సి వచ్చింది. కాని అదే సంఘ్ పరివార్ అద్వానీకి మద్దతి ప్రకటించింది. లోక్‌సభలో ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడే అద్వానీ తాను ప్రధాని పదవికి సహజ అభ్యర్థిగా చెప్పుకున్నారు<ref>ఈనాడు దినపత్రిక లో వచ్చిన వార్త తేది 11 డిసెంబర్, 2007</ref>. దాంతో సహచరులు ఆయనపై తిరగబడ్డారు. [[మరళీ మనోహర్ జోషి]], [[యశ్వంత్ సిన్హా]] లాంటి నేతలు అద్వానీ ప్రకటనపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం మురళీ మనోహర్ జోషినే ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించడం విశేషం.
 
== '''అవార్డులు, బిరుదులు''' ==
* [[1999]] లో బెస్ట్ పార్లెమెంటేరియన్ అవార్డు లభించింది.
== అద్వానీ జీవితంలో కీలక ఘట్టాలు ==
* [[1927]], [[నవంబర్ 8]] న [[పాకిస్తాన్]] లోని [[కరాచి]] లో జన్మించారు
* [[1942]] లో [[రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్]] లో చేరిక
పంక్తి 71:
* [[2008]] "మై కంట్రీ, మై లైఫ్" పేరుతో స్వీయచరిత్రను విడుదల చేశాడు.
 
== ఇవి కూడా చూడండి ==
{{భారత ఉప ప్రధానమంత్రులు}}
{{భారతీయ జనతా పార్టీ అద్యక్షులు|state=collapsed}}
{{సంఘ్ పరివార్}}
 
== మూలాలు ==
<references/>
 
[[వర్గం:1927 జననాలు]]
[[వర్గం:భారత రాజకీయ నాయకులు]]
Line 101 ⟶ 102:
[[pl:Lal Krishna Advani]]
[[sa:लाल कृष्ण आडवाणी]]
[[sd:لال ڪرشنا آڏواڻي]]
[[sv:Lal Krishna Advani]]
[[ur:لال کرشن اڈوانی]]
"https://te.wikipedia.org/wiki/లాల్_కృష్ణ_అద్వానీ" నుండి వెలికితీశారు