స్త్రీ పర్వము ప్రథమాశ్వాసము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 140:
అడుగో కోరి మరణం కిని తెచ్చుకున్న [[భీష్ముడు]] శరతల్పం మీద ఎలా పడుకుని ఉన్నాడో చూసావా ! అతడు అలా మరణాన్ని కోరి ఉండక ఉన్న అతడిని జయించడం మానవమాత్రుల తరమా ! కృష్ణా ! అతడికి నిజమైన శిష్యుడు [[అర్జునుడు]]. అతడిని శరతల్పం మీద పరండజేసి అతడికి పాతాళ గంగ తీసుకు వచ్చి దాహార్తి తీర్చిన మహా వీరుడు అర్జునుడే కదా ! సూర్యుడే భూమి మీదకు దిగి వచ్చి శరతల్పం మీద విశ్రమించినట్లు ఉంది. అలాంటి భీష్ముడు మరణిస్తే కురుకుమారులకు దిశా నిర్ధేశం చేయగల సమర్ధుడెవ్వడు. ఇంద్రుడితో సన్మానమైన [[ద్రోణుడు]] వేద వేదాంగపారతుడు. ధనుర్వేదం ఔపాశన పట్టాడు. ఎందరో రాకుమారులకు విద్యనేర్పిన వాడు. నేడు దిక్కులేకుండా పడి ఉన్నాడు. విధి ఎంత క్రూరమైంది కృష్ణా ! భీష్మ, ద్రోణులను నమ్ముకునే నా కుమారుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. అయినా అతడి తలను ద్రుపద పుత్రుడు ధృష్టద్యుమ్నుడు దారుణంగా నరికాడు. ఇది ఎలా సంభవించింది. ద్రోణుడి భార్య భర్త శవం పక్కన కూర్చుని ఎలా రోదిస్తుందో చూడు. ద్రోణుడి శిష్యులు అతడిని దహించడానికి కట్టెలు దొరకక అమ్ములు విల్లులు పోగు చేసి చితి పేరుస్తున్నారు చూడు. [[కృపి]] మొదలైన వారు ద్రోణుడికి అపసవ్యంగా ప్రదక్షిణ చేసి స్నానం చెయ్యడానికి వెళుతున్నారయ్యా !
 
==== గాంధారి శకునినిఅర్జున సాత్యకులను నిందించుట ====
కృష్ణా ! [[సాత్యకి]] అమానుషంగా తల నరికిన భూరిశ్రవసుడిని చూడు. అతడి శరీరాన్ని నక్కలు గద్దలు ఎలా పీక్కు తింటున్నాయో చూడు. ఆ భూరిశ్రవసుడి పక్కన అతడి తల్లి,
కుమారులు, భార్య ఎలా రోదిస్తున్నారో చూడు. కృష్ణా ! [[అర్జునుడు]] భూరిశ్రవసుడి భుజము నరికాడు. [[సాత్యకి]] తల నరికాడు. అయినా ! కృష్ణా ! మహావీరులైన [[అర్జునుడు]], [[సాత్యకి]] మీద ప్రేమతో ఇలా చేసి ఉంటాడంతావా ! సాధువు మంచి వాడు అయిన భూతిశ్రవసువును చంప్[ఇనందువలన అర్జునుడికి ఏమి ఒరిగింది కృష్ణా ! [[సాత్యకి]] సాధించినది ఏమిటి అపకీర్తి మూటకట్టుకోవడం తప్ప. కృష్ణా ! ఇదంతా నీ కళ్ళ ముందే జరిగింది. భూరిశ్రవసుడు సాత్యకితో యుద్ధం చేస్తున్నప్పుడు [[అర్జునుడు]] సిగ్గుమాలి అతడి చేయి నరకవచ్చునా ! అర్జునుడు చేసిన పని నీవు హర్షిస్తావా ! కృష్ణా ! " అని పరిపరి విధముల విలపించసాగింది గాంధారి.
కుమారులు, భార్య ఎలా రోదిస్తున్నారో చూడు. కృష్ణా ! [[అర్జునుడు]] భూరిశ్రవసుడి భుజము నరికాడు. [[సాత్యకి]] తల నరికాడు.
==== గాంధారి శకునిని నిందించుట ====
[[కృష్ణుడు]] ఒక్క మాట కూడా మాటాడక కుండా [[గాంధారి]] ని అనుసరిస్తున్నాడు. ఇంతలో [[గాంధారికి]] [[శకుని]] కళేబరం కనిపించింది. అది చూడగానే ఆమె ముఖం కోపంతో జేవురించింది. [[గాంధారి]] " కృష్ణా ! తన మేనల్లుడు నకులుని చేతిలో చచ్చిన నా తమ్ముడు [[శకుని]]ని చూసావా ! వీడొక మాయావి వీడి మాయలు నీ ముందు పని చేయ లేదు. నాడు మాయా జూదంలో [[ధర్మరాజు]] ను అడవులకు పంపాడు. ఇప్పుడు యుద్ధమనే జూదంలో తన ప్రాణాలు ఒడ్డి ఒడిపోయాడు. కురు పాండవులకు మధ్య శత్రుత్వానికి ముఖ్య కారకుడు ఇతడే కృష్ణా ! మేలు చేస్తున్నానని నమ్మించి నాకుమారుని నట్టేట ముంచాడు. వీడు మాత్రం బాగుపడింది ఏముంది. పుత్ర పౌత్రులతో నాశనం అయ్యాడు. అసలు నాకొడుకులకు బుద్ధి అనేది ఉంటే మాయావి అయిన వీడి మాటలు నమ్ముతారా ! అందుకు తగిన ఫలితం అనుభవించారు
 
==== గాంధారి మిగిలిన వారి కొరకు రోదించుట ====