మద్యపానం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
#సంపూర్ణ ఓటమి అంగీకారము.
#త్రాగుడు నుండి తప్పించుకోలేక బానిసగా మారడము.
మద్యపానం : -
==మితంగా తాగినా చేటే==
మద్యపానం అలవాటు గా మొదలయి చివరికి వ్యసనము గా మారుతుంది. తాగుడుకు అలవాటై, వ్యసనానంగా మారి దానికి బానిసైపోయిన వ్యక్తి పతన ప్రస్థానం ఇలా సాగుతుంది.
 
మద్యపాన అలవాతుకి కారానాలు : -
1. సరదాగా అప్పడప్పడు త్రాగడం. 2. త్రాగడం అలవాటు మొదలు. 3. దొంగతనంగా త్రాగడం. 4. అపరాధ భావము. 5. కష్టాలు చెప్పకోలేక పోవడము. 6. త్రాగి డ్రైవింగ్ చేసి అపరాధ రుసుము చెల్లించడం. 7. స్వాధీనం తప్పి అతిగా త్రాగడం. 8. గొప్పలు చెప్పుకుంటు అతిగా ప్రవర్తించడం. 9. చేసిన వాగ్దానాలు, తీర్మానాలను నిలబెట్టుకోలేకపోవడము. 10. చుట్టాలను, స్నేహితులను తప్పించుకు తిరగడము. 11. ఉద్యోగము, సంపాదనలో కష్టాలు. 12. అకారణము గా కోపము. 13. ఆహారంపై అశ్రద్ధ.
14. అనైతిక కార్యక్రమాలు. 15. హానికలిగించు ఆలొచన ధోరణి. 16. ఏ పని ప్రారంభించలేకపోవడము. 17. అస్పష్టమైన అధ్యాత్మికక చింతన. 18. సంపూర్ణ ఓటమి అంగీకారము. 19. త్రాగుడు నుండి తప్పించుకోలేక బానిసగా మారడము.
 
==మితంగా తాగినా చేటే== : -
తగు మోతాదులో మద్యం తాగితే హృదయం పదిలంగా ఉంటుందని చెప్పడం అతిశయోక్తే . పరిమిత స్థాయిలో మద్యం తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుందన్న దానికి సరైన ఆధారాలు లేవని శాస్త్రజ్ఞులు తెలిపారు.మద్యపానం వల్ల ఆరోగ్యానికి పెను ముప్పు వాటిల్లుతుంది మద్యపానం వల్ల రక్తపోటుతో పాటు గుండెపోటు కూడా వచ్చే ప్రమాదముంది.
 
మద్యనిషేధం : -
దేశవ్యాప్తంగా మద్యనిషేధం అమలుకు ఆదేశాలివ్వాలని, ప్రభుత్వం ఆదాయాన్ని మాత్రమే పట్టించుకుంటూ రాజ్యాంగ బాధ్యతను విస్మరిస్తోందని, 1995నాటి ఆంధ్రప్రదేశ్‌ ప్రొహిబిషన్‌ చట్టానికి సవరణలు తీసుకొస్తూ 1997లో చేసిన చట్టాన్ని రద్దు చేయాలంటూ నిజామాబాద్‌కు చెందిన ఎం.నారాయణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వాదనలు: " 1995లో మహిళలు ఉద్యమించడంతో నిషేధం విధించారు.అనంతరం సడలించారు.నిషేధం కొనసాగించడం సాధ్యం కాకపోవడంతో సడలించామన్నారు.మద్య నియంత్రణను చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు మద్యం వినియోగం వల్ల భంగం వాటిల్లుతుంది.మద్యం వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయి.వాహనదారులు శిరస్త్రాణం (హెల్మెట్‌) ధరించే విషయాన్ని ప్రజల ఇష్టాయిష్టాలకు వదిలిపెట్టకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.అలాగే మద్య నిషధంలోనూ ఉండాలి.మద్యంతో సంపాదించే లాభాలు వ్యాపారులకు, ప్రభుత్వానికి పెద్దమొత్తంలో సొమ్ము సంపాదించి పెట్టవచ్చును కానీ, సమాజాన్ని నష్టపరుస్తాయి.ఉత్పాదకతను దెబ్బతీస్తాయి. ఎంతో విలువైన మానవ వనరులను బలహీనపరుస్తాయి.కష్టజీవుల శ్రమఫలితంలో అత్యధిక మొత్తాన్ని అపహరించి జాతికి తీరని అపకారం చేస్తుంది.మరింత ఎక్కువ మందిని మద్య వినియోగదారులుగా మార్చడం, మద్యవ్యాపారం పరిమాణాన్ని విపరీతంగా పెంచడం- లక్ష్యంగానే ఎక్సైజ్ విధానం కొనసాగుతున్నది. నడికుడి వంటి చిన్న కేంద్రంలో ఒక మద్యం దుకాణం ఐదుకోట్ల రూపాయలకుపైగా రేటు పలికింది. హైవేల పక్కనా, విద్యాలయాలకు సమీపంలో, చివరకు దేవాలయాల కు చేరువలో మంచినీరు కూడా దుర్లభమైన మారుమూల దుర్బిక్ష గ్రామాలలో కూడా మద్యాన్నిప్రవహింపజేస్తున్నారు.మద్యవ్యాపారంతో పాటే సంచరించే గూండాల దండు, దానితో పాటే పెరిగే రాజకీయ ప్రాపకం- మొత్తం వ్యవస్థనే దుర్గంధ భరితం చేస్తున్నాయి.మద్యాన్ని వ్యాప్తి చేయడం వల్ల నష్టమవుతున్న ఆరోగ్యాలు, కోల్పోతున్న పనిదినాలు, తరిగిపోతున్న ఉత్పాదకత లెక్కవేస్తే, వేలం పాటల్లో వచ్చే వేల కోట్లు ఏ మూలకు?సంపూర్ణ మద్యనిషేధం వల్ల తాగుబోతుల కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, స్త్రీలపై అత్యాచారాలు, ఇతర నేరాలు తగ్గిపోతాయి" .
 
నిబంధనలు : -
* పాఠశాల, దేవాలయం, ఆసుపత్రికి 100 మీటర్ల దూరంలోపుగా దుకాణం ఏర్పాటు చేయకూడదు.
* పాఠశాల గుర్తింపు పొందినదై ఉండాలి. అలాగే దేవాలయం దేవాదాయ శాఖ పరిధిలోనిదై ఉండాల్సి ఉంటుంది. 30 పడకల ఆసుపత్రికి 100 మీటర్ల దూరంలోపు మద్యం దుకాణం ఏర్పాటు చేయకూడదు.
* దుకాణం ఏర్పాటు నిర్ధేశించిన స్థలం మేరకే ఉండాలి. దుకాణంతో పాటు ప్రత్యేక గదులు, బార్‌స్థాయి ఏర్పాట్లు చేయకూడదు. దుకాణం అమ్మకం స్థానం మాత్రమే. కొన్నచోటే తాగటానికి ఏర్పాట్లు చేయటం నిషిద్దం.
* మద్యం వ్యాపారులు లిక్కరు, బీరు ఇతర మద్యాన్ని బాటిల్‌పై వేసిన ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలి.
* విక్రయాలు ఉదయం 10.30గంటల నుంచి రాత్రి 11గంటల వరకు మాత్రమే జరపాలి. అంతకుమించి సమయాన్ని దాటి అమ్మకాలు జరిపిన వారికి జరిమానా విధిస్తారు.
* బార్‌లు అయితే రాత్రి 12గంటల వరకు తెరిచి ఉంచే వెసులుబాటు ఉంది.
 
సారాయి : -
ఆంధ్ర ప్రదేశ్ లో వారుణివాహినిగా పిలువబడే ఒక ఆల్కహాల్ కలిగిన మత్తు పానీయం. ఆంధ్రప్రదేశ్ ప్రతి పల్లె పల్లెలో సారాయి దుకాణాలు చూడవచ్చు.తాగి తూలి అరుగులపై పడిపోయే వారు , మద్యం మత్తులో ఇంటా, బయట ఘర్షణలకు దిగేవారి సంఖ్య అధికమవుతోంది.పనిచేసే చోటికి మొబైల్‌ షాపులూ వెళ్లిపోతున్నాయి. కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఆరోగ్యాలు పాడైపోతున్నాయి.ఈ మద్యం వ్యాపారంతో లబ్ది పొందుతోంది ప్రభుత్వం, రాజకీయ నేతలు, వ్యాపారులు, వైద్యరంగం.
 
తయారీ విధానం : -
వివిద రకాలైన పండ్లు / బెల్లం లను పులియ బెట్టి (Fermentation) తద్వారా సారాయిని తయారు చేస్తారు. దీనినే వివిద సార్లు డిస్టిలేషనుకు గురి చేసి సువాసను కలిపితే వచ్చేవే Whisky,Brandi,Rum,Vodka etc.
 
సారాయి - నష్టాలు : -
మితంగా తాగినా చేటే. తగు మోతాదులో మద్యం తాగితే హృదయం పదిలంగా ఉంటుందని చెప్పడం అతిశయోక్తే అని శాస్త్రజ్ఞులు తాజాగా ప్రకటించారు. పరిమిత స్థాయిలో మద్యం తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుందన్న దానికి సరైన ఆధారాలు లేవని న్యూజిలాండ్‌కు చెందిన శాస్త్రజ్ఞులు తెలిపారు.మితంగా మద్యం తాగితే హృదయ సంబంధ వ్యాధులు దగ్గరకు రావంటూ గతంలో రెండు సర్వేలు వెలువడ్డాయి. మద్యపానం వల్ల ఆరోగ్యానికి పెను ముప్పు వాటిల్లుతుంది అని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. మద్యపానం వల్ల రక్తపోటుతో పాటు గుండెపోటు కూడా వచ్చే ప్రమాదముందని వారు హెచ్చరించారు. సారాయి వలన ముఖ్యంగా కాలేయము దెబ్బతింటుంది.
 
==ఆల్కోపాప్స్‌==
ఆల్కోపాప్స్‌ను ఎక్సైజ్‌శాఖ సాధారణ మద్యం విభాగంలో చేర్చింది.తియ్యగా పండ్ల రసం లా ఉంటుంది.త్రాగినవారు క్రమేపీ దీనికి అలవాటు పడిపోతారు. చివరికి ఇది మద్యపానానికి దారితీస్తుంది.దీన్ని 'రెడీ టు డ్రింక్‌' అని పిలుస్తారు. నారింజ, బెర్రీ... ఇలా రకరకాల పండ్ల రుచుల్లో లభిస్తున్నాయి. పండ్ల రసంతోపాటు వీటిలో 4.8 శాతం ఆల్కహాలు ఉంటుంది.సాధారణ మద్యం కంటే దీని ధర,వినియోగం కూడా మూడురెట్లు ఎక్కువగా ఉంది.
"https://te.wikipedia.org/wiki/మద్యపానం" నుండి వెలికితీశారు