దగ్గుబాటి రామానాయుడు: కూర్పుల మధ్య తేడాలు

వ్యక్తిగత జీవితం
→‎వ్యక్తిగత జీవితం: సినిమా జీవితం
పంక్తి 8:
 
==వ్యక్తిగత జీవితం==
దగ్గుబాటి రామానాయుడు, [[1936]]వ సంవత్సరం [[జూన్ 6]]వ తేదీన [[ప్రకాశం]] జిల్లా [[కారంచేడు]] లో వెంకటేశ్వర్లు అనే వ్యవసాయ రైతు కుటుంభంలో జన్మించాడు. రామానాయుడుకి ఒక అక్క మరియు చెల్లెలు, మూడేళ్ళ వయసులోనే తల్లి చనిపోయింది. పినతల్లి వద్ద ఘరాభంగా పెరిగాడు. ఒంగోలులోని డాక్టరు బి.బి.ఎల్.సూర్యనారాయణ అనే బంధువు ఇంట్లో వుంటూ ఎస్సేసేల్సి దాకా విధ్యాబ్యాసం చేసాడు. సూర్యనారాయనను చూశాక తానూ కూడా డాక్టరు కావాలని కలలుకనేవాడు, బాడిలేనప్పుడు కాంపౌండరు అవతారం ఎత్తేవాడు. విజయవాడలో లయోలా కాలేజి ఏర్పాటు కోసం రెండు లక్షల చందాలు వసులుచేసినదుకు కృతజ్ఞ్యతగా క్రిస్టియన్ ఫాదర్లు మద్రాసులోని ఆంధ్రా లయోలా కాలేజిలో సీటు కొరకు సయం చేసారు. ఎపుడు కాలేజిలో జరిగే సంస్కృతిక కార్యక్రమాల్లో మరియు కబడ్డీ మైదానలోనే కనిపించేవాడు. మొదటి సంవత్సరం పరిక్షలు ఫెయిల్ అవడంతో, తండ్రి తిసుకువచి చిరాలలోని కళాశాలో చేర్పించారు. ఇక్కడ కాలేజి రాజకీయాలు తోడయాయి, రెండో సంవత్సరం పరిక్షలు కూడా ఫెయిల్ అయాడు. రామానాయుడు మామ కూతురు రాజేశ్వరిలో పెళ్లి జరిగింది. పెల్లియిపోగానే ఆస్తి పంచివ్వమని తండ్రిని అడిగారు, కానీ తండ్రిమాట కాదనలేక మొదటి కొడుకు సురేష్ పుట్టేదాకా ఆస్తి విభజన వాయిదాపడింది. ఆతర్వాత, వందెకరాల పొలంతో సొంత సేద్యం మొదలుపెట్టాడు.
 
==సినిమా జీవితం==
కారంచేడులో '[[నమ్మిన బంటు]]' షూటింగ్ లో ఎడ్లపందెం దృశ్యం చిత్రీకరణ జరిగేటప్పుడు, రామానాయుడు ఓ సీన్లో నటించాడు, హుషారుగా అటు ఇటు తిరుగుతుండగా సినిమావాళ్ళ దృష్టిని ఆకర్షించాడు. తిరిగి వెళ్తునప్పుడు 'మీరు సినిమాల్లోకి ఎందుకు కాకూడదు?' అని [[ అక్కినేని నాగేశ్వరరావు|అక్కినేని]] అడికితే, వూరు, వ్యవసాయం తప్పించి మరో ఆలోచన లేదని బధులు ఇచ్చాడు. ఇష్టం లేకున్నా రైసుమిల్లు వ్యాపారం మొదలు పెట్టాడు, ఓ రోజు హఠాతుగా సేల్స్-టాక్సవాళ్ళు వచ్చి, బిల్లులు రాయడములేదంటు రెండు లక్షల రూపాయలు జరిమానా విధించారు. దీనితో ఆ వ్యాపారం మిద విరక్తి వచ్చేసింది, మిల్లు ముసివేషి, వూరు విడచి [[చెన్నై|చెన్నపట్నం]] చేరుకున్నాడు. [[మహాబలిపురం]] రోడ్డులో పొలం కొన్నాడు, కాలక్షేపానికి రోజు తోడల్లుడితో కలిసి ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్ కు వెళ్ళేవాడు. అక్కడే సినిమావాళ్ళతో పరిచయాలు అయ్యాయి. 'అనురాగం' చిత్ర నిర్మాతలు భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్నామని కబురుపెట్టారు. రామానాయుడు తన తండ్రిని ఒప్పించి, దురలవాట్ల జోలికి వెళ్లనని మాటిచ్చాడు.
{{దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతలు}}