విష్ణు పురాణం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
*తరువాత మేరు పర్వతం, లవణ సముద్రం చేత ఆవరించబడిన జంబూద్వీపం, పాల సముద్రం చేత ఆవరింప బడిన శాకాద్వీపం, నేతి సముద్రంతో ఆవరింప బడిన కుశ ద్వీపం, మీగడ సముద్రంతో ఆవరింప బడిన క్రౌంచ ద్వీపం, సురా సముద్రంతో ఆవరింపబడిన శాల్మల ద్వీపం, దానిని ఆవరించిన గోమేధం ఉన్నది.
* పుష్కర ద్వీపము నడుమన మానసోత్తర పర్వతం ఉన్నది. మేరువుకు అది తూర్పున ఉన్నది. ఆగ్నేయమున అగ్ని రాజధాని ప్రభావతీ నగరం, దక్షిణమున సంయమనీపురం, నైరుతి మూల విరూపాక్షుని విక్రాంత పురం ఉన్నది, పడమట వరుణ రాజధాని సుఖప్రభ, వాయవ్య మూల వాయవ్య రాజధాని శివ, ఉత్తరమున సోముని రాజధాని విభావరి, ఈశాన్యమున శివుని పురి శర్మదాపురి ఉన్నది.
* పుష్కర ద్వీపం, స్వర్ణద్వీపం, లోలోకలోకాలోక వర్ణన, గర్భోదక సముద్రం దాని అందు నివసించు వారి వర్ణన జరిగింది.
* మేరువుకు తూర్పున ఉప్పుసముద్రం నడుమ జలములో విష్ణుతేజస్సుతో వెలిగే విష్ణులోకం ఉంది. మేరువుకు తూర్పున ఉన్న క్షీరాబ్ధి మధ్యలో విశ్హ్ణువు లక్ష్మీ సమేతుడై ఉండి హస్తదర్శనం మాత్రమే ఇస్తాడు. మేరువుకు తూర్పున పాలకడలి నడుమ శ్వేతద్వీపమందు విష్ణువు శిరస్సు చేత పంచకాల పూజలు అందుకుంటాడు.
శ్వేతద్వీపమున ప్రవేశించిన జీవులు తరువాత ఆదిత్యమండలము ద్వారా బ్రహ్మలో ప్రవేశించి అనిరుద్ధుని, సంకర్షుని పొంది చివరకు వాసుదేవుడిని పొంది ముక్తులౌతారని చెప్పబడింది.
* సీరసముద్ర ఈశాన్య దిక్కున ఆది విష్ణువు భృగ్వాది మునులు, శరీరధారులైన శాస్త్రములు, లక్ష్మాది దేవతల చేత కొలువబడుతూ ఉంటాడు. అక్కడ యోగనిద్రలో ఉన్న విష్ణువు ఉచ్వాస నిస్వాసలలో జీవుల పుట్టుక మరణం సంభవిస్తుంది.
* మేరువుకు పడమట ఘృత సముద్రముకు నడుమ ఉన్న గోవర్ధన గిరిలో దివ్యధేనువులు ఉంటాయి. అక్కడ విష్ణువు కామరూపుడై ప్రకాశిస్తుంటాడు.
* దధిసముద్రం నడుమ మహాతేజస్సు కలిగిన ఋషుల మధ్య విష్ణువు స్వర్ణ రూపుడై ప్రకాశిస్తుంటాడు. సురాసముద్రం నడుమ దేవతల నివాసమై ఉన్న ప్రదేశమున సంకర్షణుడనే పేరుతో విష్ణువును మదిర, కరీషిణి, కాంతి అను ముగ్గురు దేవతలు పరమసౌందర్యవతులై సేవిస్తుంటారు. అక్కడ ప్రజాపతులు విష్ణువును కలుసుకుంటారు.
"https://te.wikipedia.org/wiki/విష్ణు_పురాణం" నుండి వెలికితీశారు