పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
వీరు మద్రాసులోని [[ఆంధ్ర పత్రిక]] కార్యాలయంలో పనిచేశారు. 1908 నుండి ఆ పత్రిక ఉగాది సంచికలు వీరి పర్యవేక్షణలోనే విదులయ్యాయి. వీరు 1930లో ఆర్య భారతీ గ్రంథమాలను నెలకొల్పి కొన్ని సంస్కృత గ్రంథాలను ప్రకటించారు. తర్వాత బరంపురంలోని కళ్లికోట రాజా కళాశాలలో ఆంధ్ర పండిత పదవిని జీవితాంతం అలంకరించారు.
 
వీరు రాజశేఖరుని కావ్యమీమాంస; వ్యాత్సాయనుని కామసూత్రాలు, గౌతముని ధర్మసూత్రాలు విశేషాంశాలను చేర్చి సులభమైన ఆంధ్ర వివరణలతో ప్రకటించారు. కౌటిల్యుని అర్థశాస్త్రానికి అపూర్వ విశేషాలతో తెలుగు వ్యాఖ్యను, ఆంధ్ర లిపి పరిణామం అను గ్రంథాన్ని రచించారు. వీరికి నవ్య సాహిత్యంలోను మరియు వ్యవహారిక భాషలోను మక్కువ ఎక్కువ. [[గిడుగు వెంకట రామమూర్తి]] పంతులు గారికి తోడుగా ఉండి వ్యవహారిక భాషోద్యమంలోను, నవ్య సాహిత్య పరిషత్తు వారితో ఎంతో కృషిచేసి అనేక వ్యాసాలు రచించారు. వీరు "ప్రతిభ" పత్రికలో నవ్య సాహిత్య స్వరూప స్వభావాలను విపులంగా చర్చించారు.
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]