మధ్వాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ta:மத்வாசார்யா
పంక్తి 3:
మధ్వాచార్యులు (కన్నడ:ಶ್ರೀ ಮಧ್ವಾಚಾರ್ಯರು) ద్వైత వేదాంతాన్ని బోధించిన మతాచార్యులు. మధ్వాచార్యులు నిలిపిన సాంప్రదాయాలను పాటించేవారిని మధ్వులు అని పిలిస్తారు. మధ్వాచార్యుడు వాయువు, హనుమంతుడు, బీముడు యెక్క ప్రతి రూపమని నమ్ముతారు.
==పుట్టుక==
మద్వాచార్యులు [[ఉడిపి]] వద్ద నున్న [[పాజక]] గ్రామంలో [[విజయదశమి]] రోజున జన్మించాడు. మధ్వాచార్యుడి జీవిత కథను రచించిన నారాయణ పండితాచార్యుడు ఆయన తల్లిదండ్రుల పేర్లను మధ్యగేహ భట్ట, వేదవతి లుగా పేర్కొన్నాడు. ఆయనకు మొదట్లో వాసుదేవ అని పేరు పెట్టినా తరువాతి కాలంలో పూర్ణప్రజ్ఞ, ఆనందతీర్థ, మధ్వాచార్యుడు అనే పేర్లతో ప్రసిద్ధి పొందాడు.
 
బాల్యంలో ఉండగానే వాసుదేవ ఆధ్యాత్మిక విషయాలవైపు ఆసక్తి చూపుతూ వాటిని ఆకళింపు చేసుకునేవాడు. పదకొండేళ్ళ పిన్న వయసులోనే సన్యాసం వైపు ఆకర్షితుడయ్యాడు. ఉడుపి సమీపంలో నివసిస్తున్న, ఆకాలంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువుగా పేరుగాంచిన అచ్యుత ప్రజ్ఞ అనే గురువు ద్వారా సన్యాస దీక్షను స్వీకరించాడు. అప్పుడే ఆయన పేరు పూర్ణప్రజ్ఞుడు గా మారింది.
 
ఒక నెల తరువాత ఓ తర్క శాస్త్ర పండితుల బృందాన్ని తన వాదనా పటిమతో ఓడించాడు. ఆయన ప్రజ్ఞకు అబ్బురపడిన అచ్యుత ప్రజ్ఞ ఆయన్ను వేదాంత పరమైన అంశాలపై అధిపతిగా నియమించి ఆనందతీర్థ అనే బిరుదు కూడా ఇచ్చాడు.
 
==దక్షిణభారత యాత్ర==
టీనేజీ లో ఉండగానే మధ్వాచార్యుడు [[దక్షిణ భారతదేశం|దక్షిణ భారతదేశమంతా]] పర్యటించాలని సంకల్పించాడు. అనంతశయన, [[కన్యాకుమారి]], [[రామేశ్వరం]], [[శ్రీరంగం]] మొదలైన క్షేత్రాలను సందర్శించాడు. ఎక్కడికి వెళ్ళినా తాను తెలుసుకున్న తత్వాన్ని ప్రజలకు ఉపన్యాసాల రూపంలో తెలియజెప్పేవాడు. మూఢనమ్మకాల్ని వ్యతిరేకించాడు. వాటిని ఆధ్యాత్మికతతో ముడిపెట్టకూడదని భావించాడు. అలా ఆయన ప్రబోధించిన తత్వం దేశవ్యాప్తంగా పండితుల్లో చర్చలు రేకెత్తించగా సనాతన వాదుల నుంచి వ్యతిరేకత కూడా ఎదురైంది. కానీ ఆయన వేటికీ చలించలేదు. యాత్ర పుర్తి చేసుకుని ఉడుపి చేరుకోగానే [[భగవద్గీత]] పై తన భాష్యాన్ని రాయడం ప్రారంభించాడు.
"https://te.wikipedia.org/wiki/మధ్వాచార్యుడు" నుండి వెలికితీశారు