మాధ్యమము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
=== కళారూప మాధ్యమం ===
గానము, నాట్యము, నాటకము, బుర్రకధ, వీధినాటకాలు, కధాకాలక్షేపము, హరికధ, ఉపన్యాసము, యక్షగానము, ప్రవచనము వంటి రూపాలలో రాజుల కధలను, సంఘటనలను, పురాణాలను ఆకర్షణీయమైన కళారూపంలో ప్రజలకు చేరువ చేసే వారు. ఇవి ప్రజల మనసు రంజింప చేస్తూ ఇతిహాసాలను, ఆ నాటి రాజుల చరిత్రలను, ముఖ్య సంఘటనలు ప్రజల వద్దకు చేరేవి. వాల్మికి రామాయణమును రచించి రాముని పుత్రులకు గాన రూపంలో శిక్షణ ఇచ్చి అయోధ్య అంతా వినిపించ చేసాడు. రచించినది ప్రజల వద్దకు చేర్చడంత అవసరమో ఆది కవి నిరూపించాడు. వ్యాసుడు భారత రచన చేసి వాటిని శిష్యులకు నేర్పి ఆ కావ్యాన్ని ప్రజల మద్యకు తీసుకు వెళ్ళాడు. ఈ కధను వినిపించే వారిని సూతులు అంటారు. అలాగే వేద విభజన చేసి వాటిని శిష్యులకు నేర్పించి వేద వ్యాప్తికి తోడ్పడ్డాడు. వ్యాసుడి కుమారుడైన శుక మహర్షి భాగవత కధను స్వయంగా పరిక్షిత్తు మహారాజుకు ప్రవచన రూపంలో వినిపించాడు.కాశిదాసు నాటకాలను రచించి కళా కారుల చేత నటింప చేసి రచనలను ప్రజలకు నాటక రూపంలో చేర వేసాడు. నాటకాలు కధలను ఇతిహాసాలను దృశ్యరూపంలో ప్రజలకు అందించాయి. కబీరుదాసు, త్యాగరాజు, అన్నమయ్య వంటి గాయకులు తమ భక్తిరసమయ రచనలను కృతులను స్వయంగా గాన రూపంలో తిరుగుతూ పాడుతూ అందించారు. దేవదాసీ సంప్రదాయంతో నాట్యరూపంతో పురాణేతిహాసాలు ప్రజలకు చేరువ చేయబడ్డాయి. ఆసక్తి కరమైన మరొక మాధ్యమం బుర్రకధ. ఇది ముగ్గురు కళాకారులచేత చెప్పబడుతుంది. ప్రధాన కధకుడు కధను వినిపిస్తుంటాడు. పక్కన ఉండే ఇద్దరు కధకులు హాస్యోక్తులు పలుకుతూ తందాన అని చెబుతూ కొంత రంజింప చేస్తారు. దీనిలో కళాకారులు తమ వాద్యాలను తామే వాయుస్తుంటారు. వీరు ముఖ్యమైన సంఘటనలను, చారిత్రక విషయాలను చెప్పడానికి ప్రాముఖ్యత ఇస్తారు. హరికధకులు ఒంటరిగా కధచెప్తారు. వీరు కధను వచన రూపంలోను అక్కడక్కడా పద్య రూపంలోను గాన రూపంలోను చెప్తూ కొంత అభినయం చూపిస్తూ చెప్తారు. వీరికి పక్క వాయుద్యం కావాలి. వీరంతా ఆ కాలంలో ఆలయాలను తమ వేదికగా చేసుకుని ప్రచారం చేసిన వారే.
=== అచ్చురూపమాధ్యమం ===
కాగితం, కలం కనుగొనడం మాధ్యమంలో విపవాత్మకమైన మార్పులబ్ను తీసుకు వచ్చింది. రాజ్యాంగపరమైన విషయాలను, రాజ్యాంగ వ్యవహారాలను, ప్రపంచం నలుమూలలా జరిగే సంఘటనలు, నూతన పరిశోధనలు వంటి అనేక విషయాలను ప్రజల మద్యకు దినపత్రికల రూపంలో అందడం మొదలైంది. అలాగే వారపత్రికలు, పక్షపత్రికలు, మాసపత్రికలు వ్యాపారసరళిలో కధలు, కావ్యాలు, ధారావాహికలు, చిట్కాలు , స్త్రీలను ఆకర్షించే అల్లికలు, వంటలు, ముగ్గులూ, పిల్లను ఆకర్షించే బొమ్మల కధలు, అందరినీ ఆకర్షించే వ్యంగ్య చిత్రాలతో ప్రజలను రంజింపచేసాయి. కొందరు ఔత్సాహికులు చేతివ్రాత పత్రికలు కూడా నడిపారు. అచ్చుతో పని లేకుండా చేతితో వ్రాసి ఒకరికి ఒకరు అందిస్తూ చదువుతూ పోవడం. కరపత్రాలు అనే చిన్న కాగితాలలో ముద్రించి ప్రజలకు ఉచితంగా పంచి పెట్టి ప్రజలకు సమాచారాన్ని అందించడం అచ్చు యంత్రాల ఉపయోగంతో సాధ్యమైంది. కొన్ని మతపరమైన పుస్తకాలను ముద్రించి ప్రజలకు ఉచితంగా పంచి మతప్రచారం చేస్తూ ఉండడం జన విదితమే. హిందువులు దేవతా స్తోత్రాలను చిన్న చుఇన్న పుస్తకాలుగా ముద్రించి దైవప్రీతి కొరకు భక్తులకు పంచి ఇస్తారు. క్రైస్తవులు తమ ప్రవక్తలు కధలను సువార్తలు అన్న పేరుతో ముద్రించి అందరికీ ఉచితంగా ఇస్తుంటారు.
"https://te.wikipedia.org/wiki/మాధ్యమము" నుండి వెలికితీశారు