కృష్ణాష్టమి: కూర్పుల మధ్య తేడాలు

చి r2.5.2) (యంత్రము కలుపుతున్నది: id:Krishna Janmashtami
పంక్తి 7:
కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా [[ఉపవాసం]] ఉండి, సాయంకాలం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. [[ఊయల]]లు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు.
 
పుర వీధుల్లో ఎత్తుగా [[ఉట్లు]] కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని 'ఉట్ల పండుగ' లేదా 'ఉట్ల తిరునాళ్ళు' అని పిలుస్తారు.
 
భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని [[బ్రహ్మాండ పురాణం]] చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది.
"https://te.wikipedia.org/wiki/కృష్ణాష్టమి" నుండి వెలికితీశారు