కొత్త సచ్చిదానందమూర్తి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
{{వికీకరణ}}
'''కొత్త సచ్చిదానందమూర్తి''' ప్రఖ్యాత తత్వశాస్త్రాచార్యుడు. ఆంధ్ర విశ్వకళాపరిషత్ లో తత్వశాస్త్రాచార్యునిగా, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయములో ఉపకులపతిగా పనిచేశాడు. బౌద్ధమతముపై, బుద్ధుని బోధనల తత్వముపై విశేష పరిశోధనలు చేశాడు. ఆచార్య నాగార్జునిపై ఎంతో కొనియాడబడిన గ్రంథము వ్రాశాడు<ref>నాగార్జున: Murty, K. Satchidananda. 1971. Nagarjuna. National Book Trust, New Delhi. 2nd edition: 1978</ref>. భారతీయ తత్వశ్రాస్తానికి సరికొత్త నిర్వచనం చెప్పిన ప్రఖ్యాత తత్వవేత్త, పద్మవిభూషణ్ ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి(87). తత్వవేత్తగా 50కిపైగా పుస్తకాలు, వందల కొలదీ వ్యాసాలు రాశారు. ఆయన భార్య వేదవతీదేవి, నలుగురు కుమారులున్నారు.
గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడిలో 1924లో కొత్త వీరభద్రయ్య, రాజారత్నమ్మ దంపతులకు జన్మించిన సచ్చిదానందమూర్తి.. భారతీయ తత్వశ్రాస్తాన్ని విశ్వవ్యాప్తం చేశారు. దేశంలోని జేఎన్యూ(వారణాసి), హిందూ, బెనారస్ తదితర ప్రఖ్యాత యూనివర్సిటీలతో పాటు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, బీజింగ్లోని పీపుల్స్ యూనివర్సిటీ ఆఫ్ చైనాలో సైతం సచ్చిదానంద సేవలు అందించటం తత్వశాస్త్రంలో ఈయన ప్రతిభకు నిదర్శనం. సచ్చిదానంద ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం 'పద్మవిభూషణ్' బిరుదుతో ఆయనను సత్కరించింది. తత్వశాస్త్రంలో విశేష కృషి చేసిన వారికి ఇచ్చే అత్యున్నతమైన డాక్టర్ బి.సి.రాయ్ జాతీయ అవార్డును తొలి సారిగా 1982లో సచ్చిదానందకే ఇచ్చారు.
|