గౌతు లచ్చన్న: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Seshagirirao (చర్చ | రచనలు) |
Teju2friends (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 2:
[[బొమ్మ: Gowthu Lachanna.jpg |thumb| సర్దార్ గౌతు లచ్చన్న]]
==బాల్యము మరియు విద్యాభ్యాసము==
సర్దార్ గౌతు లచ్చన్న: ఉత్తర [[కోస్తా]] కళింగసీమలో ఉద్దానం ప్రాంతాన (నాటి [[గంజాం జిల్లా]]) [[సోంపేట]] తాలూకాలో [[బారువా]] అనే గ్రామంలో [[1909]] [[ఆగష్టు 16]] వ తేదీన ఒక సాధారణ బీద సెగిడి కుటుంబములో గౌతు చిట్టయ్య, రాజమ్మ దంపతులకు 8 వ సంతానం గా పుట్టాడు. లచ్చన్న తాత. తండ్రులు సెగిడి కులవృత్తే వారికి కూడుబెట్టేది. [[ఈత|ఈతచెట్లను]]
==స్వాతంత్రోద్యమం==
మెట్రిక్యులేషన్ చదువుతుండగానే 21వ ఏట గాంధీజీ పిలుపువిని విద్యకు స్వస్తి చెప్పి స్వాతంత్రోద్యమంలో దూకాడు. [[1930 |1930 లో]]
[[1932]] వ సంవత్సరంలో శాసనోల్లంఘన ఉద్య్మంలో పాల్గొంటున్న లచ్చన్నను బంధించి [[రాజమండ్రి]] జైల్లో ఐదు మాసాలు ఉంచారు. రాజకీయాలకూ, సంఘసంస్కరణలకు సంబంధమేర్పరచి గాంధీజీ స్వాతంత్ర్యోద్యమాలు నడిపారు. అందులోని భాగమే అంటరానితనం నిర్మూలన. అంటరానితనం మీద కత్తి ఝుళిపించాడు లచ్చన్న. అతను నడిపిన హరిజన సేవా సంఘాలు, చేపట్టిన హరిజన రక్షణ యాత్రలు ప్రజలను బాగా ప్రభావితం చేశాయి. [[బారువా]] గ్రామ వీధుల్లో యువజనులను వెంట వేసుకొని భజన గీతాలు పాడుతూ వెళుతుంటే గ్రామమంతా దద్దరిల్లుతున్నట్లు కనిపించేది. సవర్ణులలో ఆశ్చర్యం, హరిజనులలో ఆశలు రేకెత్తించేవి. రాత్రి పాఠశాలలు నిర్వహించి బడుగు వర్గాల విద్యాభివృద్ధికి అతనెంతో కృషి చేశాడు. హరిజనులకు దేవాలయాలలో ప్రవేశం కలిగించాడు. లచ్చన్న చేసిన ఆర్ధిక సహాయంతో కుశాగ్రబుద్దులైన ఎందరో హరిజన విద్యార్థులు ఉన్నత స్థానాలనలంకరించారు.
ఆచార్య రంగాతో లచ్చన్న స్నేహం రాష్ట్ర రాజకీయాలలో ఒక నూతన శకాన్ని ఆరంభించింది. [[మహాత్మాగాంధీ]], పండిట్ [[నెహ్రూ] గురు శిష్య సంబంధం లాంటిదే రంగా- లచ్చన్నల సంబంధం. [[నిడుబ్రోలు]] లో రంగా గారు స్థాపించిన రైతాంగ విద్యాలయంలో తొలిజట్టు విద్యార్థులలో లచ్చన్న ఒకరు. ఆ విశ్వవిద్యాలయంలో పొందిన శిక్షణ అతని భావి జీవితానికెంతో ఉపకరించింది. జమీందారీ వ్యతిరేక పోరాటానికి ఆయనను నడుము బిగించేటట్లు చేసింది. [[1935]] లో రాష్ట్రంలో కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ శాఖ ఏర్పడినప్పుడు దానికి అతను సభ్యుడుగా ఎన్నికయ్యాడు.
ఆ రోజుల్లో రైతు సంఘాలు కాంగ్రెస్ పార్టీలోని అంగాలే. [[1939]] లో [[త్రిపుర|త్రిపురలో]]
స్వాతంత్ర్యోద్యమంలో చివరి పోరాటం [[క్విట్ ఇండియా]] ఉద్యమం. [[1942]] లో జరిగిన యీ ఉద్యమంలో పాల్గొన్న లచ్చన్నను ప్రభుత్వం అతి ప్రమాదకరమైన వ్యక్తిగా గుర్తించి, ఆయనను పట్టి యిచ్చిన వారికి పదివేల రూపాయల బహుమతిని ప్రకటించింది. చివరకు ప్రభుత్వమే అతనిని బంధించి మూడేళ్ళు జైల్లో ఉంచి [[1945]] అక్టోబర్ లో విడుదల చేసింది. ఆనాటి నుంచి లచ్చన్న ఆంధ్ర అగ్రనాయకులలో ఒకరైనాడు. [[1947]] లో లచ్చన్న ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కు రాష్ట్ర శాఖ అధ్యక్షులయ్యాడు.
|