పిలకా గణపతిశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Krittivaas (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Krittivaas (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
పిలకా గణపతి శాస్త్రి 1911 ఫిబ్రవరి 24 న తూర్పు గోదావరి జిల్లా కట్టంగ గ్రామంలో జన్మించారు. విజయనగరం సంస్కృత కళాశాలలో సాహితీ విద్యా ప్రవీణ పట్టా పొందారు.ఆయన రాజమహేంద్రవరం ఆంధ్ర యువతీ సంస్కృత పాఠశాలలోను, వీరేశలింగం పాఠశాలలోను తెలుగు పండితులుగా పనిచేశారు. కవిగా, వ్యాఖ్యాతగా, నవలా రచయితగా, అనువాదకునిగా, ఆర్ష విద్వాంసులుగా పత్రికా సంపాదకులుగా విశేష ఖ్యాతి పొందారు. పిలకా గణపతి శాస్ర్తి గారు ఆంధ్ర శిల్పి, ఆంధ్రభారతి వంటి పత్రికలకు సహాయ సంపాదకులుగా పనిచేశారు.
వారు రచించిన నవలలు:
* విశాల నేత్రాలు (ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ బహుమతి)
* హేమపాత్ర
* అశోకవర్ధనుడు
* మీనాంబిక
* కాశ్మీరపట్టమహిషి
* గృహిణి
సంస్కృతం నుండి వచనానువాదాలు:
* వ్యాసభారతం
* హరివంశం
* దేవీ భాగవతం
* గృహ దహనం - శరత్బాబు బెంగాలీ నవల
* రెడ్ లిల్లీ - అనటోల్ ఫ్రాన్స్
ఖండకావ్యాలు:
* విభ్రాంతామరుకము
* రత్నోపహారం
===== మూలాలు =====
# http://www.andhrabhoomi.net/sahiti/sahi-402
[[ వర్గం: తెలుగు నవలా రచయితలు|ప]]
|