భక్త తుకారాం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
కథాస్థానం మహారాష్ట్ర లో దేహూ గ్రామం. కథాకాలం పదిహేడవ శతాబ్దపు తొలి అర్థం. భక్తి ఉద్యమ కాలం.
 
[[తుకారాం]] పాండురంగ విఠలునికి మహాభక్తుడు. భార్య ఇద్దరు బిడ్డలతో సంసారి. భక్తునిగా అతని గుర్తింపు, గొప్ప భక్తునిగా చెప్పుకుంటూ ఇద్దరు శిష్యులతో గ్రామాన్ని మోసం చేస్తున్న కుంభోజీ (?) కి ఇబ్బంది కలిగిస్తుంది. తుకారాం ప్రాభవన్ని తగ్గించడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. అతనిపై వేశ్యను ప్రయోగిస్తాడు. ఆమె తుకారాం భక్తురాలిగా మారిపోతుంది. శూద్రుడైన తుకారాం వ్రాసిన అభంగాలు హైందవ సంప్రదాయానికి విరుద్ధమని వాటిని నాశనం చేయాలని పీఠాధిపతితో చెప్పిస్తాడు కుంభోజి. ఎంతో శ్రమతో కూర్చిన అభంగాలు నీటిపాలు కావటంతో కలత చెందిన తుకారాం నది ఒడ్డునే నిద్ఫ్రాహారాలు మాని ఉండి పోతాడు. దివ్య శక్తి అభంగాలలు తిరిగి ప్రసాదించగా ఆనందపరవశుడౌతాడు. తుకారాం పట్ల నిర్దయగా ఉన్న పీఠాధిపతి సైతం తుకారాం భక్తిని తెలుసుకుంటాడు. కుంభోజి ఆలయంలోని పాండురంగని విగ్రహాన్ని నూతిలో పడవేసి, సూద్రుడైన తుకారాం చర్యల్ని భరించలేని పాండురంగడు గుడి నుండి వెళ్ళిపోయాడని ప్రచారం చేస్తాడు. అదే విషయాన్ని శివాజీ మహరాజు కు ఫిర్యాదు చేస్తాడు. ఇదివరలో తుకారాం గురించి విన్న శివాజీ అతనికి కానుకలు పంపగా తుకారాం తిరస్కరించి ఉన్నాడు. అతణ్ణి పరిశీలించే దృష్టి తో శివాజీ ఫిర్యాదు ను విచారించే నిమిత్తం తుకారాం దగ్గరకు వస్తాడు. శివాజీ చూస్తుండగానే పాండురంగని విగ్రహం తిరిగి ఆలయంలో ప్రత్యక్షం ఔతుంది. ఈ లోపులో కుంభోజీ అందించిన సమాచారంతో, శివాజీ శత్రువులు అసన్నధంగా ఉన్న శివాజీ ను చుట్టుముట్టుతారు. తుకారాం కోరిక మేరకు పామ్దురంగడు అనేక శివాజీ మూర్తులుగా శత్రువుల్ని తుదముట్టిస్తాడు. శివాజీ తుకారాం భక్తి తత్పరతకు పరవశుడై తనను శిష్యునిగా స్వీకరించమంటాడు. క్షాత్రమున్నవారు రాజ్యాన్ని రక్షించాలని శివాజీకి తెలియజేస్తాడు.
 
సంసారి గా ఉంటూ, తన కర్తవ్యాలన్నిటినీ నెరవేరుస్తూనే, అధ్యాత్మికతను కూడా కొనసాగించడం, తుకారాం ప్రత్యేకత అని మహావిష్ణువు లక్ష్మి కి తెలియజేసి అతని కోసం గరుడ వాహనాన్ని పంపి తన వాద్దకు రప్పించుకుంటాడు.
"https://te.wikipedia.org/wiki/భక్త_తుకారాం" నుండి వెలికితీశారు