విశ్వనాధ నాయకుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
production_company = [[విజయ మాధవీ కంబైన్స్]]|
starring = [[కృష్ణంరాజు ]],<br>[[శివాజీ గణేశన్]],<br>[[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]],<br>[[కె.ఆర్.విజయ]],<br>[[జయప్రద]],<br>[[శరత్‌బాబు]] |
}}
 
నాయక వంశ రాజ్య పాలనకు ఆద్యుడు విశ్వనాధనాయకుడు. శ్రీకృష్ణదేవరాయల సర్వసేనాని నాగమనాయకుని కుమారుడు విశ్వనాధనాయకుడు. నాగమనాయకునికి చాలా కాలం సంతానం కలగలేదు. భార్యతో కాశీ యాత్ర చేసిన తరువాత కుమారుడు కలిగేడు. విశ్వనాధుని దయతో కలిగినాడని విశ్వనాధనాయకుడని నామకరణం చేసేడు నాగమనాయకుడు.
నాగమనాయకుడు ప్రభుభక్తి పరాయణునిగా కీర్తి గాంచేడు. శ్రీ కృష్ణదేవరాయలకు అత్యంత ఆప్తులలో, ఆంతరంగికులలో ఒకడు నాగమనాయకుడు..
తండ్రి పలుకుబడితో ప్రమేయం లేకుండా స్వయంప్రతిభతో శ్రీ కృష్ణదేవరాయలి అంగరక్షకునిగా నియమితుడైనాడు విశ్వనాధ నాయకుడు. మధురనేలుతున్న పాండ్య రాజు, తంజావూరు పాలకుడు చోళ రాజు శ్రీకృష్ణదేవరాయల సామంతులు. చోళరాజు పాండ్యుని పై దండయాత్ర చేసి పాండ్యరాజుని రాజ్యభ్రష్టుని చేసేడు. పాండ్యరాజు శ్రీకృష్ణదేవరాయలితో మొర పెట్టుకున్నాడు.శ్రీకృష్ణదేవరాయలు చోళ రాజుని శిక్షించి, పాండ్యరాజుని తిరిగి సింహాసనం పై పునఃప్రతిష్ట వలిసింది గా నాగమనాయకుని ఆదేశిస్తాడు.నాగమనాయకుడు చోళుని ఓడించి రాజ్యాన్ని హస్తగతం చేసుకుంటాడు. కానీ రాజాజ్ఞను ధిక్కరించి తనను స్వతంత్ర రాజుగా ప్రకటించుకుంటాడు. ఊహించని ఈ పరిణామానికి శ్రీకృష్ణదేవరాయలు విస్తుపోతాడు.నాగమనాయకుని పట్టి బంధించగల వారెవరని నిండు సభలో ప్రశ్నిస్తాడు శ్రీకృష్ణదేవరాయలు.. ఎవరూ ముందుకు రారు. విశ్వనాధ నాయకుడు తండ్రి నెదుర్కొనడానికి ముందుకొస్తాడు.విశ్వనాధనాయకుడి తల్లి ఈ పరిణామానికి తల్లడిల్లుతుంది. ఎవరికి ఆపద జరిగినా తనకు తీరని దుఃఖం కలుగుతుందని కలవరపడుతుంది.. తండ్రి ద్వారా సంక్రమించిన కళంకాన్ని చెరపవలసిన బాధ్యత తనదే అని తల్లిని ఒప్పించి, శ్రీకృష్ణదేవరాయల, మహామంత్రి ఆశిస్సులతో దాడికి వెడలుతాడు విశ్వనాధనాయకుడు. నాగమనాయకుని కుమారుని తనతో కలవమంటాడు.. విశ్వనాధుని భవిష్యత్తు కై తానీ నిర్ణయం తీసుకున్నానని నచ్చచెప్ప బోతాడు. శ్రీకృష్ణదేవరాయల వారి మన్నింపు కోరి రాజాజ్ఞ పాటించమంటాడు విశ్వనాధనాయకుడు.తండ్రికొడుకుల మధ్య యుధ్దం అనివార్యమవుతుంది. యుధ్దంలో తండ్రిని ఎదిరించి, ఓడించి, బంధించి ప్రభువు ముందు నిలుపుతాడు విశ్వనాధనాయకుడు. నాగమనాయకుని మన్నించి విశ్వనాధనాయకుని పాండ్యరాజ్యానికి రాజుగా ప్రకటిస్తాడు శ్రీకృష్ణదేవరాయలు. పాండ్యరాజుకు విజయనగరంలో ఆశ్రయం కల్పిస్తాడు శ్రీకృష్ణదేవరాయలు..
విశ్వనాధనాయకునిగా కృష్ణ, నాగమనాయకునిగా శివాజీగణేశన్, శ్రీకృష్ణదేవరాయలుగా కృష్ణంరాజు, మహామంత్రి తిమ్మరుసుగా జె.వి.సోమయాజులు, విశ్వనాధనాయకుని ప్రేయసిగా జయప్రద, తల్లిగా కె.ఆర్.విజయ నటించారు.
చిత్రం ఆశించినంతగా విజయవంతం కాలేదు.
}}
"https://te.wikipedia.org/wiki/విశ్వనాధ_నాయకుడు" నుండి వెలికితీశారు