తిరుమల తిరుపతి దేవస్థానం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 78:
 
===కల్యాణమస్తు===
2006 వ సంవత్సరంలో బోర్డు ఛైర్మన్‌ కరుణాకర్‌రెడ్డి ఈ పథకానికి రూపకల్పన చేశారు. 2007 ఫిబ్రవరి 21 న దీనికి రాష్ట్ర వ్యాప్తంగా అంకురార్పణ జరిగింది.సరాసరి ఒక్కో జంటకు రూ 7 వేల వరకు వ్యయం అవుతున్నది.ఇప్పటివరకూ 34,017 జంటలను ఒక్కటి చేసిన టిటిడికి అయిన ఖర్చుసుమారు 24 కోట్ల రూపాయలు.స్వామిని దర్శించి,ముడుపులు చెల్లించే వారిలో తమిళనాడు, కర్నాటక, ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారుకూడా ఉన్నారు కనుక కళ్యాణమస్తును దేశ వ్యాపితం చేయాలని కొందరు వాదిస్తున్నారు.బంగారపు తాళిబొట్టు, వెండి మట్టెలు, వధూవరులకు నూతన వస్త్రాలు, తలంబ్రాలు, పెళ్లిసామాగ్రి, మంగళ వాయిద్యాలు, ధార్మిక స్తోత్ర పుస్తకాలు, పురోహితుడు, 60 మంది బంధుమిత్రులకు పెళ్లి భోజనాలు ఉచితంగా కల్పిస్తున్నది.వివాహాలు జరిపించలేని పేద, మధ్య తరగతి కుటుంబాలవారు , తల్లిదండ్రులు లేని అనాథలుకూడా ఈ కార్యక్రమంవల్ల లబ్దిపొందుతున్నారు.కానీ చౌకగా జరిగే ఇలాంటి మూకుమ్మడి కళ్యాణాలకు గౌరవంతక్కువ అనే భావనతోభావంతో ప్రజలనుండి తగినంత స్పందన లేదు.రాష్ట్ర వ్యాపితంగా ఈ కార్యక్రమాన్నిఏడాది పొడవునా కాకుండా ఏడాదికి ఒక్క రోజుమాత్రమే చేపట్టటంతో నిరాశ చెందుతున్నారు.[[గోదాదేవి]] లాగానే [[బీబీ నాంచారి]] అనే ముస్లిం స్త్రీ కూడా విష్ణుపత్నిగా ఆరాధించ బడుతుంది.వెంకటేశ్వరుడు లౌకికవాదానికి ప్రతీకగా మారి [[మతాంతర వివాహాలు]] కు మార్గం సుగమం చేసి మార్గదర్శకుడయ్యాడని [[సుబ్బన్న శతావధాని]] చెప్పారు.http://beta.thehindu.com/arts/books/article415269.ece .శ్రీవేంకటేశ్వరుని పై భక్తి విశ్వాసాలున్న హిందూ-ముస్లిము జంటలకు కూడా కళ్యాణమస్తు కార్యక్రమం విస్తరించి మతసామరస్యం,లౌకికత్వం బలపడేలా చెయ్యాలని వేంకటేశ్వరుని పై భక్తి విశ్వాసాలున్నముస్లిములు కోరుతున్నారు.
 
==ఇవికూడా చూడండి==