బాపట్ల: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
శ్రీశ్రీశ్రీ భావన్నారాయణ స్వామి |
||
పంక్తి 14:
ఇది బాపట్లకు 9 కి.మీ దూరంలో ఉన్న ఓడరేవు మరియు పర్యాటక కేంద్రము. ఇక్కడ భారత వాయుసేన వారి కేంద్రము కూడా కలదు.
కప్పలవారిపాలెం, పిన్నిబోయినవారిపాలెం సమీపంలో నల్లమడ వాగు,తూర్పు తుంగభద్ర, గుండంతిప్ప స్ట్రెయిట్ కట్, రొంపేరు రైట్ ఆర్మ్ డ్రెయిన్లు సముద్రంలో కలుస్తాయి.
భావనారాయణ స్వామివికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: పేజీకి సంబంధించిన లింకులు, అన్వేషణ
శ్రీశ్రీశ్రీ భావన్నారాయణ స్వామి దేవాలయము తెలుగు రాష్ట్రములోని ప్రాచీన వైష్ణవ క్షేత్రాలలో ఒకటి. ఇది సుమారు 1400 సంవత్సరాలకు పూర్వము చోళుల చే నిర్మితమైనది.
శైవమునకు పంచారామక్షేత్రాలు ఉన్నట్టుగానే వైష్ణవమునకు కూడా పంచభావన్నారాయణ క్షేత్రాలు కలవు. అవి బాపట్ల(భావపురి), పొన్నూరు(స్వర్ణపురి), భావదేవరపల్లి (కృష్ణా జిల్లా), సర్పవరం (నేడు కాకినాడ లో అంతర్భాగం) , పట్టసం. వీనిలొ ప్రకాశం జిల్లాలోని పెదగంజాం కూడా ఉంది అని చెప్తారు. వీటిలో ప్రధానమైనది బాపట్ల. ఇక్కడ నెలకొని ఉన్న భావనారాయణ స్వామి పేరిట ఈ ఊరికి భావపురి అనే పేరు వచ్చింది. కాలాంతరాన ఆ పేరు రూపాంతరం చెంది భావపట్ల గా, బాపట్ల గా మారింది. ఈ దేవాలయంలో భావన్నారాయణుడు ఇతర పరివార దేవతలయిన శాంత కేశవస్వామి,జ్యాలానరసింహస్వామి, శ్రీరాముడు, అమ్మవార్లు, ఆళ్వారుల తో కొలువైవుండి భక్తుల ఇష్టదైవంగా వెలుగొందుతున్నాడు. ముఖ్యంగా కేశవస్వామి ఎంతో సుందరంగా ఉండి భక్తులకు కనువిందు చేస్తాడు.
శ్రీకృష్ణదేవరాయలు ఈ దేవస్థానాన్ని సందర్శించినట్టుగా ఆధారాలున్నాయి. ఆలయంలొని ప్రతి రాతిపైనా స్థలపురాణం, ఆలయచరిత్ర ఇత్యాది విషయాలు వ్రాయబడిఉన్నాయి.
ప్రతిఏటా వేసవికాలంలో వైభవంగా జరిగే తిరునాళ్ల (బ్రహ్మోత్సవాలు)కు లక్షల సంఖ్యలో భక్తులు వచ్చిచేరతారు.
[మార్చు] ఆలయ విశేషాలుభావన్నారాయణస్వామి మూర్తి కాలి వేళ్లపై నిలబడి భక్తుల కోసం ఎదురుచూస్తున్నట్టుగా ఉంటుందట.
మరో వింత ఏమిటంటే ఆలయంలోపల చలికాలంలో వెచ్చగాను, ఎండాకాలంలో చల్లగాను మనం అనుభూతికిలోనవుతాం. గతంలో ఆలయంలోనే శివాలయం కూడా అంతర్భాగంగా ఉండేది.
ఈఆలయానికి రెండు ధ్వజ స్తంభాలు ఉండటం మరియు ఆలయ స్తంభాలు గజపాద( ఏనుగు కాలు) ఆకారంలో స్తంభాలు ఉండటం విశేషం. ష్ఆలయంలో గర్భగుడి వెనుక పైకప్పు పై మత్స్యం (చేప ఆకారం) కనిపిస్తుంది. దాన్ని తాకితే శుభమని భక్తులు భావిస్తారు. దేశములోనే ఎక్కడాలేనట్టుగా విఖనసమునీంద్రులకు కూడా మందిరము కలదు...అందుకే బాపట్ల మంచివిద్యాకేంద్రంగా వెలుగొందుతున్నదని చెప్తారు.
--------------------------------------------------------------------------------
16052011 ఈనాడు సర్పవర౦-కాకినాడ గ్రామీన మ౦డల౦ సర్పవర౦ లొ వెలసిన శీు రాజ్యలక్ష్మి సమేతశీుభావనారాయనస్వామి దివ్య కల్యానమ్ శనివార౦ రాతిుఅత్య౦తవైభవంగాజరిగి౦దిChekkavvsrao 13:06, 20 మే 2011 (UTC)
--------------------------------------------------------------------------------
[మార్చు] ఆలయచరిత్రఇది స్వయంవ్యక్తక్షేత్రం.
ఈ ఆలయం శాలివాహనశకం 515 (కల్యాది 3694, క్రీశ 594) లో క్రిమికంఠచోళునిచే నిర్మించబడింది. గ్రామం 8 దిక్కులలో వళ్ళాలమ్మ, కుంచలమ్మ, శంకరమ్మ, శింగారమ్మ, ధనకొండలమ్మ, మూలకారమ్మ, నాగభూషణమ్మ, బొబ్బలమ్మ అనే గ్రామశక్తులను ప్రతిష్టించారు. క్రిమికంఠచోళుని తర్వాత... ఈ ప్రాంతంపై ఆధిపత్యం వరుసగా నెరిపింది.....చోళభూపాలదేవుడు, వీర ప్రతాపశూర భల్లయ చోళ మహారాజు, కుళోత్తుంగచోళయదేవ మహారాజులు..ఆ తరవాత గజపతులు (1319 వరకు).....తర్వాత శ్రీకృష్ణదేవరాయలు (18సం.లు) తర్వాత అచ్యుతదేవరాయల, సదాశివరాయల .... ఆధీనంలో ఈ ఆలయం మహోజ్వలంగా వెలిగింది..... ఆ కాలంలో ఎంతగానో ప్రసిద్ధి చెందింది. కానీ తదనంతరం వచ్చిన మహ్మదీయుల, ఫ్రెంచి, ఆంగ్లేయుల దండయాత్రలకు, దోపిడీలకు లోనైంది.... వారు అతి ప్రాచీనమైన ఆలయ శిల్పసంపదకుకు ఎనలేని నష్టంచేసారు...క్రమంగా ఆలయం జీర్ణావస్థకు చేరుకుంది.
ఫ్రెంచివారు గ్రామ శక్తులను ధ్వంసం చేయగా ప్రస్తుతం పోలేరమ్మను గ్రామానికి పశ్చిమంగా గూర్పు ముఖంగా ప్రతిష్ష్టించారు.
తర్వాత బ్రిటీషుకాలంలో కొందరు ప్రధానాలయానికి పక్కగా ఉన్న శివాలయంలోని శివలింగాన్ని తీసుకెళ్లి ప్రత్యేకంగా మందిరాన్ని నిర్మించుకున్నారు...(ఆ విధంగా విదేశీయులు విభజించు పాలించు అన్న తమసిద్ధాంతాన్ని మతసంబంధిత విషయాల్లో కూడా చక్కగా అమలుపరిచారు.)
అదేకాలంలో దివాన్ గావున్న శ్రీరాజా కాండ్రేగుల జోగిజగన్నాథరావు బహద్దూరు గారు (రాజమండ్రి), ఆ తర్వాత వాసిరెడ్ది వెంకటాద్రినాయుడుగారు లు ఆలయాన్ని పునరుద్ధరించారు.
ఇంతటి ఘనచరిత కల ఈ కోవెల ఈనాటికీ..... కొన్ని ఇతర ప్రాచీన ఆలయాలకులానే పాలకుల అలక్ష్యమునకు, అధికారుల అలసత్వం నకు, పురావస్తుశాఖ-రాష్ట్ర దేవాదాయ శాఖ ల సమన్వయలోపం లకు... ప్రత్యక్ష నిదర్శనంగా దర్శనమిస్తుంది.
కొసమెరుపు ఏంటంటే.... తమ ఘనచరితకు వారసత్వంగా నిలిచిన ఈ అపురూప కట్టడాన్ని రక్షించుకోవాలని కానీ, (ఏ ఆలయం ఐతే తమ పట్టణం ఏర్పడటానికి ప్రధాన కారణమో) దానికి పూర్వవైభవం తేవాలనికానీ స్థానికులుసైతం ఎటువంటిప్రయత్నమూ చేయడం లేదు......
[మార్చు] మూలాలు, వనరులుభావన్నారాయణస్వామి స్థల ప్రభావం - .శ్రీ నల్లూరి రంగాచార్యులు గారు
భక్తి మాసపత్రిక
స్థానికగాథలు
== పాలనా విభాగాలు ==
|