ప్రతిభా పిక్చర్స్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:TeluguFilmPoster_Balaraju_1948.jpg‎|thumb|ప్రతిభా సంస్థ నిర్మించిన అత్యుత్తమ చిత్రం [[బాలరాజు]] (1948)]]
'''ప్రతిభా పిక్చర్స్''' పాతతరం తెలుగు చలనచిత్ర నిర్మాణ సంస్థ. దీనిని ప్రముఖ నిర్మాత మరియు దర్శకుడైన [[ఘంటసాల బలరామయ్య]] 1940 సంవత్సరంలో స్థాపించారు. ఇంతకుముందు శ్రీరామా ఫిలిమ్స్, కుబేరా పిక్చర్స్ పేరుతో కొన్ని చిత్రాలు నిర్మించి ప్రతిభా పిక్చర్స్‌ను స్థాపించారు. ఈ సంస్థ నిర్మించిన అత్యుత్తమ చిత్రం [[1948]]లో విడుదలైన [[బాలరాజు]]. [[1950]]లో కేవలం 19 రోజులలో [[శ్రీ లక్ష్మమ్మ కథ]] చిత్రాన్ని నిర్మించి విడుదల చేసిన ఘనత ఈ సంస్థకు దక్కింది. [[1955]]లో విడుదలైన [[రేచుక్క (1955 సినిమా)|రేచుక్క]] చిత్ర నిర్మాణ సమయంలో ఘంటసాల బలరామయ్య హఠాత్తుగా మరణించడంతో ఆ చిత్రాన్ని [[పి.పుల్లయ్య]] పూర్తి చేశారు. బలరామయ్య మరణం తర్వాత ఆయన కుమారుడు ప్రతిభ పిక్చర్స్ పతాకం మీద రెండు చిత్రాలు నిర్మించారు. అవి [[ఏది నిజం]] (1956) మరియు [[దొంగలున్నారు జాగ్రత్త (1958 సినిమా)|దొంగలున్నారు జాగ్రత్త]] (1958). ఏది నిజం చిత్రాన్ని ప్రముఖ నటుడు మరియు వీణవిద్వాంసుడు [[ఎస్.బాలచందర్]] తీయగా, దొంగలున్నారు జాగ్రత్తను ప్రముఖ సంగీతదర్శకుడు [[భీమవరపు నరసింహారావు]] తీయడం విశేషం.
 
"https://te.wikipedia.org/wiki/ప్రతిభా_పిక్చర్స్" నుండి వెలికితీశారు