శ్రీకృష్ణ పాండవీయం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
జరాసంధునిగా ముక్కామల, శిశుపాలునిగా రాజనాల, రుక్మిగా కైకాల సత్యనారయణ పాత్రలలో జీవించారు. మిగిలిననటీనటులు పాత్రల పరిధి మేరకు నటించారు.<br />
భారత కథలో భాగవత కథ రుక్మిణీకల్యాణాన్ని జోడించారు. ఐతే అది అతికినట్టు కాకుండా సహజంగా ఇమిడి పోయింది. కంటిన్యూటి ఎక్కడా చెడలేదు.<br />
మయసభ సెట్టింగ్ చాలా భాగుంటుంది. భారీ సెట్టింగ్.ఆ సెట్టింగ్ గురించి ఆ రోజుల్లో చాలా గొప్పగా చెప్పుకునే వారట. ఆ సెట్ విజయ వాహిని స్టూడియో లో వేసేరట. ఆ ఫ్లోర్ లో ఎవ్వరినీ అనుమతించే వారట కాదట నిర్మాతలు. దానిని గురించి విన్న స్టూడియో అధినేత బి.నాగిరెడ్డి గారు ఆ సెట్ ను చూద్దామనంటే ఫ్లోర్ లోకి ప్రవేశానికి అనుమతి లభించ లేదట.విషయం తెలిసిన ఎన్.టి.ఆర్, తివిక్రమరావు సోదరులు నాగిరెడ్డి గారిని సగౌరవంగా తీసుకువెళ్లి సెట్ చూపించారట.<br />
పౌరాణిక పాత్ర పోషణలోనే కాదు దర్శకత్వం లో కూడా తన పట్టును నిరూపించుకున్నారు ఎన్.టి. రామారావు.<br />
పండిత పామరుల మెప్పును పొంది, సంస్ధకు కీర్తిని, కనకాన్ని సంపాదించిన చిత్రం.
 
"https://te.wikipedia.org/wiki/శ్రీకృష్ణ_పాండవీయం" నుండి వెలికితీశారు