పామాయిల్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 13:
|}}
'''పామాయిల్''' ఒక రకమైన [[నూనె]]. వంటలకు వాడే నూనె.
* ఆంధ్ర రాష్టంలో [[ఆయిల్ పాం]] (పామాయిల్) తోటల సాగు విస్తీర్ణం పెంచాలన్న ఉద్దేశాన్ని, ప్రైవేటు కంపెనీల నిర్వాకం, ఉద్యాన శాఖ నిర్లక్ష్యం తీవ్రంగా దెబ్బతీశాయి. గత ఆర్ధిక సంవత్సరం (2010-11) సాగు లక్ష్యంలో కనీసం సగమైనా నెరవేరకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాఛారం. గత
* దేశంలోకెల్లా , ఆంధ్రప్రదేశ్ లోనే ఆయిల్పాం తోటల సాగు అత్యధికంగా ఉంది (రాజమండ్రి నుంచి ఏలూరు రైలులో వెళుతున్నప్పుడు, ఈ తోటలు మనకు కనువిందు చేస్తాయి). ఇప్పటికే 2.50 లక్షల ఎకరాల్లో/ హెక్టార్లలో పంట సాగులో ఉంది. గత ఏడాది, తొలుత 86 వేల ఎకరాల అదనపు సాగు లక్ష్యాన్ని నిర్దేశింఛినా, తరవాత దానిని 37 వేల ఎకరాలకు /హెక్టార్లకు తగ్గించారు. చివరికి 18,167 ఎకరాలను /హెక్టార్లను దాటలేక పోయారు. గత ఏడాది సాగు పెరగకపోవడానికి ప్రైవేటు కంపెనీల నిర్వాకమే కారణమని ఉద్యాన శాఖ చెబుతోంది. నాలుగు కంపెనీలు తొలుత 6 జిల్లాల్లో కొత్తగా ఆయిల్పాం సాగును ప్రోత్సహిస్తామని రెండేళ్ళ క్రితం ముందుకొచ్ఛాయి. చెరకు పంట తరహాలో ఆయిల్ పాంను సైతం ఒక్కో మండలాన్ని ఒక్కో కంపెనీకి ప్రభుత్వం కేటాయిస్తోంది. అక్కడి రైతులతో పంట సాగును ప్రోత్సహించి దాని కొనుగోలుకు సదరు కంపెనీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలి. కానీ, ఇప్పటి వరకూ తమకు కేటాయించిన ప్రాంతాలకు సంబంధించి ఆ 4 కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకోలేదు. ప్రభుత్వం ఈ కంపెనీల కోసం ఏడాది పాటు ఎదురుచూసి వారం క్రితం ఉత్తర్వులను సవరించింది. రెండు కంపెనీల ఒప్పందాలను రద్ధు చేసింది. అటు కంపెనీల నిర్వాకం, ఇటు ఉద్యాన శాఖ నిర్లక్ష్యం కారణంగా మధ్యలో రైతులు పంట వేయలేక నష్ట పోయారు. వారికి ప్రోత్సాహకాలు అందించేవారు లేక పంటను వేయలేక పోయారని అధికార వర్గాలే అంగీకరిస్తున్నాయి . వాస్తవానికి ఈ కంపెనీల సామర్ధ్యంపై ముందుగా సరైన పరిశీలన చేయకుండానే వాటికి ఆయా జిల్లాల్లో మండలాలను కేటాయించారన్న ఆరోపణలున్నాయి. ఆయిల్పాం సాగు, పామాయిల్ ఉత్పత్తిపై సరైన పరిజ్ఞానం, అవగాహన లేనివాటికి పంట సాగును ప్రోత్సహించాలని నిర్దేశించి ఉద్యాన శాఖ మిన్నకుండిపోవడం కూడా లక్ష్యం చేరకపోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గత ఏడాది లక్ష్యమే నెరవేరకపోగా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి (2011-12) రాష్త్రంలో లక్ష హెక్టార్లలో /ఎకరాల్లో అదనంగా సాగు ఛేయాలని కేంద్రం రాష్త్రానికి లక్ష్యం నిర్దేశించింది.
|