స్వాతి కిరణం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
ఏ విధంగా చూసినా ఇది చాలా గొప్ప సినిమా..తెలుగు సినిమా లలోనే కాదు యావత్తూ సినిమాలను ఎంతగా కాచి వడపోసి ఆణిముత్యాలని ఏ కొద్ది పాటి సినిమాలను ఏరినా ఈ సినిమాకు స్ధానం దక్కాలి..ఏదో దురభిమానంతోనో లేదా ఇతర సంకుచితిత్వంతోనో చెప్పడం కాదు. కథాంశం, పాత్రల రూపకల్పన, నటీనటుల అద్వీతయ నటన, మధురాతి మధురమైన పాటలు అన్నీ అంత గొప్పగా సమకూరేయి.. అనంత రామశర్మ గా ముమ్ముటి, అతని భార్యగా రాధిక, గంగాధరంగా మాస్టర్ మంజునాధ్ పాత్రలలో ఇమిడి పోయేరు.. పక్షితీర్ధం మామ్మగారిగా జయంతి, గంగాధరం తండ్రిగా ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తల్లిగా జానకి, పక్షితీర్ధ మామ్మగారి మేనల్లుడిగా అచ్యుత్ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.. ఆనతి నీయరా హరా పాటకు రాధిక, మమ్ముటి ఆహబావాలు చెప్పనలవి కావు.. అనంత రామశర్మను శివునిగా, అతని భార్యను పార్వతిగా, గంగాధరాన్ని బాలగణపతి గా పోల్చి రూపకాలంకారంతో జాలిగా జాబిలమ్మ పాట రచించిన తీరు, స్వరకల్పన, చిత్రీకరణ, నటీనటుల నటన అన్నీ అద్వీతయం.
కె.వి.మహదేవన్ స్వర రచన మహోన్నతం.. ఆనతి నీయరా పాటకు వాణీ జయరాంకు జాతీయ స్ధాయిలో ఉత్తమ గాయనిగా ఎన్నికైంది..ఇంత గొప్ప చిత్రానికికళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకులు, కథా రచయిత.. ఆయన కీర్తికిరీటంలో ఈ సినిమా కలికితురాయి..మరొక విశేషం ఈ చిత్రంలో గణపతి సచ్చిదానందస్వామి దర్శనమిస్తారు.<br />
== యాంటీ సెంటమెంట్సెంటిమెంట్ ==
బలమైన పతాక సన్నివేశం కోసం కథ ముగింపు ఈ విధంగా చేసి ఉంటారు కానీ, గంగాధరం మరణం ప్రేకక్షులకు ఏ మాత్రం నచ్చలేదు..యాంటీ సెంటిమెంటయ్యింది..దానితో ప్రజాదరణ పొందలేదు.. చిత్రంలో కనిపించే గణపతి సచ్చిదానాంద స్వామి ద్వారా అనంత రామశర్మ లో పరివర్తన తీసుకు వచ్చినట్లు కథ మార్చి ఉంటే ప్రజల ఆమోదం పొంది ఉండేదా.. ఏమో..
ఏమైనా, ఎంతో గుర్తింపు, ఎన్నో అవార్డులు రావలసిన సినిమా..కావలిసినంత గుర్తింపు దక్కకపోడవడం నిస్సంశయంగా నిరాశ పరిచే విషయం..శంకరాభరణం సినిమా లాగా మోత మోగ లేదు.. మబ్బుల చాటు సూర్య బింబమై పోయింది..కనీసం, ఈ చిత్రానికి జాతీయ స్ధాయిలో ఉత్తమ సంగీత దర్శకుని అవార్డు దక్కక పోవడం సోచనీయం..<br />
 
==పాటలు==
'''సంగీతం''' - ''కె.వి.మహదేవన్''
"https://te.wikipedia.org/wiki/స్వాతి_కిరణం" నుండి వెలికితీశారు