స్వర్ణయుగ సంగీత దర్శకులు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Maheshbandaru (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 4:
దీనిని చిమట మ్యూజిక్ వారు 2011 లో ప్రచురించారు."ఎందరో మహానుభావులు అందరికి వందనాలు" అనే మాట క్రింద పొందుపరచిన సంగీత దర్శకులకు సరిగ్గా సరిపోతుంది.
ఈ స్వరకర్తల సంగీత ప్రయాణాన్ని ఒక గ్రంధంగా మలిచి, ఇంతగా ప్రజాదరణ పొందటానికి ముఖ్యకారకులైన చిమట మ్యూజిక్ అధినేత చిమట శ్రీనివాసరావు మరియు పులగం చిన్నారయణల అకుంటిత దీక్ష, కృషి ఫలితమే ఈ "స్వర్ణయుగ సంగీత దర్శకులు". అందునా ముఖ్యంగా చిమట శ్రీనివాసరావు గారి గురించి చెప్పుకోవాలి. ఈయన స్వతహాగా తెలుగు భాషాభిమాని. అందునా తెలుగు పాత పాటలంటే ఈయనకు ఎనలేని మక్కువ.ఆ ఇష్టంతోనే చిమటమ్యూజిక్ అనే వెబ్ సైట్ ను ప్రారంభించి అందులో 50వ దశకం నుంచి 90వ దశకం ప్రారంభం వరకు తెలుగులో వచ్చిన మెలోడిలన్నింటిని ఇందులో పొందుపరిచారు. ఈయన ఓరోజు గొల్లపూడి రాసిన "అమ్మ కడుపు చల్లగా" అనే పుస్తకాన్ని చదవటం జరిగింది. ఆ సమయంలోనే అదే క్వాలిటితో మన తెలుగు సంగీత దర్శకుల జీవిత చరిత్ర విశేషాలతో ఓ పుస్తకాన్ని ప్రచురించాలని నిశ్చయించుకున్నారు. అలా నిర్ణయించుకున్నాక ఒక మంచి రచయిత కోసం అన్వేషణ మొదలైంది.
అలా శ్రీనివాసరావు గారి స్నేహితుడైన సంజయ్ కిషోర్ ని సంప్రదించారు. ఆయన పులగం చిన్నారయణ అయితే ఈ పుస్తకాన్ని ఓ మహగ్రంధంగా తీర్చిదిద్దగలడని, దీనికి అవసరమైన పాత ఫొటోలన్నింటిని కిషోర్ గారు ఇస్తానని చెప్పగా వెంటనే చిన్నారాయణను కలిసి ఈ మహాయజ్ఞం గురించి చెప్పగా ఆయన అంగీకరించి, ఒక మహాగ్రంధంగా మలిచిన తీరు అద్భుతం. ఈ విషయంలో పులగం చిన్నారాయణ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
పులగం చిన్నారయణ గారు కృషి, పట్టుదల అకుంటిత దీక్షా ఫలితమే ఈ మహాగ్రంధం. ఈ గ్రంధంలో ఆయన రచనా శైలి, కొన్ని పద ప్రయోగాలు, పాఠకులను ఆశాంతం కట్టిపడేస్తాయి. ఆ మహానుభావుల జీవిత విశేషాలను, వాళ్లు స్వరపరిచిన పాటల పద పల్లవులను, చిత్రాల
==సంగీత దర్శకులు==
|